టీడీపీ అభ్యర్ధుల తుది జాబితా ప్రకటించిన చంద్రబాబు

ఏపీలో ఎన్నికల రసవత్తర పోరుకి మరో అడుగు పడిపోయింది.ఇప్పటికే వైసీపీ పార్టీ తన పార్టీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్ధులందరిని ప్రకటించగా.

 Tdp Announce Final Candidates List-TeluguStop.com

టీడీపీ మాత్రం రెండు విడతలలో అభ్యర్ధులని ప్రకటించిన ఓ 48 సీట్లు, ఆలాగే కొట్టని ఎంపీ స్థానాలని పెండింగ్ లో ఉంచింది.అయితే ఈ మిగిలిన తుది జాబితా మీద కసరత్తు చేసిన చంద్రబాబు అర్ధరాత్రి మిగిలిన అభ్యర్ధులని ప్రకటించారు.

ఇందులో సీట్లు రావని భావించిన రాయపాటి, టీజీ భరత్ లకి ఎంపీ టికెట్స్ కన్ఫర్మ్ అయ్యాయి.

ఇదిలా ఉంటే వైజాగ్ నుంచి టీడీపీలో చేరిన మాజీ ఎంపీ సంబ్బం హరికి చంద్రబాబు భీమిలి టికెట్ ని కేటాయించారు.

అయితే భీమిలి టికెట్ గంటా శ్రీనివాసరావు ఆశించారు.కాని దానిని ఫైనల్ గా సబ్బం హరికి కేటాయించడం విశేషం.ఈ సారి గంటా శ్రీనివాసరావుని విశాఖ పశ్చిమ నియోజక వర్గం నుంచి టీడీపీ బరిలో నిలుపుతుంది.మొత్తానికి సమీకరణాలు అన్ని పూర్తి చేసుకున్న తర్వాత బాబు తుది జాబితాని ప్రకటించారు.

అయితే ఈ జాబితా కారణంగా ఇప్పుడు టీడీపీ టికెట్ ఆశించి బంగపడ్డ వారి నుంచి అసంతృప్తి వ్యక్తం అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube