ఏపీలో ఎన్నికల రసవత్తర పోరుకి మరో అడుగు పడిపోయింది.ఇప్పటికే వైసీపీ పార్టీ తన పార్టీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్ధులందరిని ప్రకటించగా.
టీడీపీ మాత్రం రెండు విడతలలో అభ్యర్ధులని ప్రకటించిన ఓ 48 సీట్లు, ఆలాగే కొట్టని ఎంపీ స్థానాలని పెండింగ్ లో ఉంచింది.అయితే ఈ మిగిలిన తుది జాబితా మీద కసరత్తు చేసిన చంద్రబాబు అర్ధరాత్రి మిగిలిన అభ్యర్ధులని ప్రకటించారు.
ఇందులో సీట్లు రావని భావించిన రాయపాటి, టీజీ భరత్ లకి ఎంపీ టికెట్స్ కన్ఫర్మ్ అయ్యాయి.
ఇదిలా ఉంటే వైజాగ్ నుంచి టీడీపీలో చేరిన మాజీ ఎంపీ సంబ్బం హరికి చంద్రబాబు భీమిలి టికెట్ ని కేటాయించారు.
అయితే భీమిలి టికెట్ గంటా శ్రీనివాసరావు ఆశించారు.కాని దానిని ఫైనల్ గా సబ్బం హరికి కేటాయించడం విశేషం.ఈ సారి గంటా శ్రీనివాసరావుని విశాఖ పశ్చిమ నియోజక వర్గం నుంచి టీడీపీ బరిలో నిలుపుతుంది.మొత్తానికి సమీకరణాలు అన్ని పూర్తి చేసుకున్న తర్వాత బాబు తుది జాబితాని ప్రకటించారు.
అయితే ఈ జాబితా కారణంగా ఇప్పుడు టీడీపీ టికెట్ ఆశించి బంగపడ్డ వారి నుంచి అసంతృప్తి వ్యక్తం అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.