పార్టీ నుంచి పార్టీ మారడం ఎమ్మెల్యే లకి కొత్తేమీ కాదు కానీ తెలుగు దేశం పార్టీ కి వైకాపా ఎమ్మెల్యేలు ఒస్తున్న తీరుని చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోంది అతి తక్కువ నిడివి లో దదాపు తొమ్మిది మంది ఎమ్మెల్యే లని తమ బుట్టలో వేసుకుంది టీడీపీ పార్టీ.‘మా ప్రభుత్వాన్ని కూలగొడ్తానని జగన్ రాజ్భవన్ సాక్షిగా చెప్పారు.అందుకే మేము కూడా మా పార్టీలోకి వచ్చే నేతల్ని చేర్చుకోవాలనే నిర్ణయానికి వచ్చాం.’ అని బహిరంగంగానే చెబుతున్నారు టీడీపీ జనాలు.
ఆపరేషన్ ఆకర్ష్ లో ఎలాంటి ఆకర్షణలు ఇస్తూ ఎమ్మెల్యేలని పడగోడుతున్నారు అనేది చూస్తే బేరం కుదరడం లో భూ కొనుగోళ్ళు బాగా ఉపయోగ పడుతున్నాయి అంటున్నారు.ప్రధానంగా కృష్ణా జిల్లాలోని భూముల్ని ‘ఆకర్ష’ పథకం కింద వచ్చే ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు అధికార పార్టీ ఆఫర్ చేస్తోందన్న ప్రచారం తెరపైకొచ్చింది.
ఓ పక్క డబ్బు, ఇంకో పక్క ఖరీదైన భూములు.ఇవి కాకుండా కాంట్రాక్టులు.భూములని ఎరగా చూపి ‘ అభివృద్ధి ‘ సాకుతో ఇలా ఎమ్మెల్యేలని కొంటున్నారు అని ఆరోపణలు వినిపిస్తున్నాయి.