అమరావతి: చంద్రబాబు నాయుడు నివాసం లో టీడీఎల్పీ సమావేశం.హజరైన పార్టీ ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీలు.
సభ లో అనుసరించాల్సిన వ్యూహం, అజెండా అంశాలపై చంద్రబాబు తో చర్చించిన సభ్యులు.అనంతరం అసెంబ్లీకి బయలుదేరిన టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.
అచ్చెన్నాయుడు, టీడీపీ ఏపీ అధ్యక్షుడు.మూడు సంవత్సరాలుగా టీడీపీ సబ్యులను అవమానాలకు గురి చేస్తున్నారు.
ప్రతిపక్ష నాయకుడుతో పాటు కుటుంబ సభ్యులను సైతం అవమానిస్తున్నారు.శాసనసభా గౌరవాన్ని వైసీపీ ఎమ్మెల్యేలు మంట గలుపుతున్నారు.
కర్తవ్య బాధ్యతను నెరవేర్చడం కోసం టీడీపీ తరపున సభకు హాజరు అవుతున్నాం.శాసన సభలో ఇన్ని ఇబ్బందులు, అవమానాలు ఎప్పుడు ఎదుర్కోలేదు.
30 అంశాలను సిద్ధం చేసి సభకు వెళ్తున్నాం.సభలో మాట్లాడేందుకు మైక్ ఇవ్వడం లేదు.
శాసన సభను కౌరవ సభగా మార్చారూ మూడేళ్ళలో సభ సజావుగా నడవడం లేదు.సభ గౌరవం పెంచేలా ప్రతిపక్ష పార్టీకి సభలో మాట్లాడే అవకాశం కల్పించాలి.
స్పీకర్ వైసీపీ సభ్యుడిగా కాకుండా హుందాగా వ్యవహరించాలి.సభలో మైక్ ఇవ్వకపోతే అసెంబ్లీకి వెళ్లం.
ప్రభుత్వ ప్రకటనలకు శాసనసభా నిర్వహణపై ఆచరణలో పొంతన ఉండటం లేదు.