రాజకీయ స్వార్ధ ప్రయోజనాల కోసం ప్రజల భవిష్యత్తులు తాకట్టు పెట్టడం రాజకీయ నాయకులకి కొత్తేమి కాదు.అభివృద్ధి చెందిన అమెరికా కూడా ఇలాంటి రాజకీయాలు మినహాయింపు కాదు.
ప్రస్తుతం కరోనా విలయ తాండవం చేస్తున్న సమయంలో పెద్దన్న ప్రపంచానికే పెద్దన్న పాత్ర పోషిస్తున్న అమెరికా తన సొంత ప్రజల విషయంలో, అమెరికా అభివృద్ధి విషయంలో మాత్రం తప్పటడుగులు రాజకీయం చేస్తోందని అంటున్నారు నిపుణులు.
అమెరికా అధ్యక్షుడు తాజాగా అమెరికాలో పనిచేస్తున్న విదేశీయులపై మోపుతున్న ఉక్కు పాదం అమెరికా అభివృద్ధికి దారుణమైన ఆటంకం కలిగించడమే కాకుండా ఆర్ధికంగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు టీసీయస్ సీఈవో రాజేశ్ గోపీనాద్.
విదేశీ వర్కర్లకు అనుమతిని ఇచ్చే హెచ్1 బీ, ఎల్-1 వీసాలపై ఆక్షలు పెట్టడం మంచి పరిణామం కాదని ఆయన తన అభిప్రాయాన్ని తెలిపారు.ఈ క్రమంలోనే ట్రంప్ నిర్ణయాలని తప్పుబట్టారు.
భారతీయ నిపుణులు ఎన్నో ఏళ్ళుగా అలుపెరుగని సేవలను అమెరికా క్లైంట్స్ కి అందించారని అమెరికా ఆర్ధిక వ్యవస్థ ఈ స్థాయిలో బలపడడానికి ప్రధానకారమైన భారతీయులపై ట్రంప్ నిర్ణయం తీవ్రమైన ప్రభావం చూపుతోందని ఓ సమావేశంలో ఆయన వెల్లడించారు.ప్రస్తుతం భారతీయ ఐటీ నిపుణుల పరిస్థితి దిక్కు తోచని స్థితిలో ఉందని ఆయన తెలిపారు.ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం కేవలం ఎన్నికల్లో గెలవడానికి మాత్రమేనని ఇలాంటి నిర్ణయం ప్రభుత్వం తీసుకుంటుందని ఎవరూ ఊహించలేదని తన అభిప్రాయాన్ని తెలిపారు.