దుబ్బాక ఉప ఎన్నికల్లో ఘోరంగా బోల్తా పడడంతో పాటు మూడో స్థానంతో సరిపెట్టుకున్న కాంగ్రెస్ ఇప్పుడు గ్రేటర్ ఎన్నికల నామినేషన్ అంకంలోనే చేతులు ఎత్తేస్తోంది. నోటిఫికేషన్ అలా రిలీజ్ అయ్యిందో లేదో ఆ పార్టీ ఓటమిని అంగీకరించిన పరిస్థితే కనిపిస్తోంది.
ఇప్పటికే గ్రేటర్ మాజీ మేయర్ బండ కార్తీక రెడ్డి కాంగ్రెస్కు రాజీనామా చేసి బీజేపీలో చేరిపోయారు.ఆమెకు వచ్చే ఎన్నికల్లో సికింద్రాబాద్ అసెంబ్లీ సీటు ఇస్తామని.
ప్రస్తుత గ్రేటర్ ఎన్నికల్లో ఆమె కోరుకున్న వారికి కొన్ని కార్పొరేటర్ సీట్లు సికింద్రాబాద్ నియోజకవర్గంలో ఇస్తామని ఆఫర్ చేయడంతో కార్తీకరెడ్డి హస్తానికి హ్యాండ్ ఇచ్చేశారు.
ఇప్పుడు ఇదే లిస్టులో మరికొందరు కాంగ్రెస్ నేతలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది.
శేరిలింగంపల్లి మాజీ ఎమ్మెల్యే ములుగు
బిక్షపతి యాదవ్,
ప్రస్తుత శేరిలింగంపల్లి కాంగ్రెస్ ఇన్చార్జ్ రవికుమార్ యాదవ్ ఇద్దరు కాంగ్రెస్కు రాజీనామా చేశారు.వీరు బీజేపీలో చేరేందుకు రెడీ అవుతున్నారు.
గ్రేటర్ ఎన్నికల వేళ తమ నియోజకవర్గంలో తమకు తెలియకుండానే కార్పొరేటర్ టిక్కెట్లు ఇస్తున్నారని వారు రగిలిపోయారు.కూకట్పల్లి, సనత్నగర్ లాంటి చోట్ల తమకు టిక్కెట్లు రాలేదని కొందరు నేతలు బీజేపీ కండువాలు కప్పేసుకుంటున్నారు.
కొన్ని నియోజకవర్గాల్లో బీజేపీకి బలమైన అభ్యర్థులు లేకపోవడంతో కాంగ్రెస్ నుంచి వచ్చిన వారికి వచ్చినట్టు కండువాలు కప్పేసి కార్పొరేటర్ టిక్కెట్లు ఇస్తున్నారు.ఈ పరిణామాలతో గ్రేటర్ కాంగ్రెస్ ఉక్కిరి బిక్కిరి అవుతోంది.ఇదిలా ఉంటే చివరకు గ్రేటర్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న, సికింద్రాబాద్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ సైతం కాంగ్రెస్కు రాజీనామా చేసేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.గాంధీభవన్లో జరిగిన సమావేశానికి సైతం ఆయన డుమ్మా కొట్టారు.
నగర కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నా తనకు తెలియకుండానే టిక్కెట్లు ఇస్తున్నారని ఆయన వాపోతున్నారు.ఏదేమైనా నామినేషన్ల పర్వంలోనే కాంగ్రెస్ తేలిపోగా.
ఇక్కడ కూడా టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ మధ్యే ప్రధాన పోటీ నడిచే పరిస్థితి ఉంది.
.