తెలంగాణా విద్యా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.జూలై 1 నుండి కొత్త అకడమెక్ ఇయర్ మొదలు పెట్టవచ్చని ఇప్పటికే ప్రకటించగా టీసీ విషయంపై కొత్త విషయాలను ప్రకటించింది.
విద్యార్ధులు ఒక పాఠశాల నుండి మరో పాఠశాలలో చేరాలంటే ట్రాన్స్ ఫర్ సటిఫికెట్ కంపల్సరీ టీసీ ఉంటేనే వారి చదివింది ఎంతవరకు వారి కండక్ట్ తెలుస్తుంద్.అయితే ప్రైవేట్ స్కూల్స్ లో టీసీ విషయంలో స్టూడెంట్స్ ఇబ్బందులు పడుతున్నారు.
ఈ విషయంపై విద్యాశాఖ సచాలకురాలు శ్రీదేవసేన 8వ తరగతి వరకు పాఠశాలల్లో చేరేందుకు టీసీ అవసరం లేదని చెప్పారు. విద్యాహక్కు చట్టంలో టీసీ అవసరం లేదన్న విషయం ఉందని ఆమె చెప్పారు.
ఈ విషయంపై ఏమైనా సమస్యలు వస్తే జిల్లా డీ.ఈ.ఓ లను సంప్రదించాలని చెప్పారు.ఇక కొత్త పాఠశాలల్లో చైల్డ్ ఇంఫో డేటాలో పేరు నమోదు అయ్యేలా చూడాలని శ్రీదేవసేన అన్నారు.
ఇక స్టూడెంట్స్ టీసీ కోసం అంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదన్నమాట.ఇదివరకు టీసీ కోసం విద్యార్ధులు చాలా ఇబ్బందులు ఎదుర్కున్నారు.
కాని తెలంగాణ విద్యాశాఖ నిర్ణయంతో విద్యార్ధులకు కాస్త టెన్షన్ లేకుండా చేశారు.స్కూల్స్ ఓపెన్ అయినా ప్రస్తుతానికి ఆన్ లైన్ క్లాసులకు పర్మిషన్ ఇస్తున్నారు.
కరోనా థర్డ్ వేవ్ ప్రభావం ఎంతవరకు ఉంటుందో చూసి ఫిజికల్ క్లాసుల మీద ఓ నిర్ణయానికి వస్తారని తెలుస్తుంది.