అంతరిక్షంలో అడుగు పెట్టానని మనిషి ఆనందపడుతున్నాడు.కానీ తన ఎదుగుదల చాటున వినాశనాన్ని కూడా మోసుకువస్తున్న విషయాన్ని మరచిపోతున్నాడు.
జ్ఞానాన్ని ఎంతలా అభివృద్ధి చేసుకున్న, కోట్ల సంపాదన కూడ బెట్టుకుని కులుకుతున్న ప్రకృతి సృష్టించే వినాశనాన్ని, ఊహించకుండా వచ్చే మరణాన్ని ఆపలేక పోతున్నాడు మరమనిషిగా మారిన మనిషి.
ఇక ఇప్పటికే కోవిడ్ విరుచుకు పడుతుండగా దీనికి తోడుగా తౌతే పెను తుపానుగా మారి ముంబయి తీరాన్ని అతలాకుతలం చేసింది.
దీని వల్ల ఇక్కడి సముద్రం అల్లకల్లోలంగా మారడంతో రెండు భారీ నౌకల(బార్జ్లు) యాంకర్లు తెగిపోయాయి.సముద్ర అలల ధాటికి ఈ నౌకలు కొట్టుకు పోతున్నాయి.
ఇక ఒక నౌకలో 273 మంది ఉండగా.మరొక నౌకలో 137 మంది ఉన్నట్టు సమాచారం.
అయితే ఇందులో ఒక నౌక పెద్ద బండరాయిని ఢీ కొట్టడంతో ఆ నౌకలో ఉన్న చాలా మంది గల్లంతు అయ్యినట్లుగా తెలుస్తుంది.ఈ ప్రమాదంలో సుమారుగా 150 మంది వరకు గల్లంతు అయ్యినట్లు సమాచారం.
ఇంకా పూర్తి వివరాలు తెలియవలసి ఉంది.