ఇటీవల లోకేష్ ప్రారంభించిన యువగలం పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న ఉన్నపలంగా కుప్పకూలడంతో వెంటనే టీడీపీ నేతలు అభిమానులు సమీపంలోని ఆసుపత్రికి చేర్పించిన విషయం తెలిసిందే.పరిస్థితి విషమించడంతో బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించారు.
అయితే హాస్పిటల్లో చేర్పించి దాదాపు వారం రోజులు కావస్తున్నా కూడా ఇప్పటివరకు తారకరత్నకు మెలకువ రాకపోవడంతో మెగా అభిమానులు నందమూరి కుటుంబ సభ్యులు టెన్షన్ పడుతున్నారు.దీంతో తారకరత్న ఆరోగ్యంపై ఆందోళన కొనసాగుతూనే ఉంది.
అయితే హెల్త్ కండిషన్ బాగానే ఉందని ట్రీట్మెంట్ కు కూడా కార్యకర్త స్పందిస్తున్నాడని వైద్యులు కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
డాక్టర్లు పెద్ద ప్రమాదం అయితే తప్పింది అని చెప్పడంతో నందమూరి కుటుంబ సభ్యులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు.తారకరత్న పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని అంతా కోరుకుంటున్నారు.ఇది ఇలా ఉంటే ప్రస్తుతం సోషల్ మీడియాలో తారకరత్న వైద్య ఖర్చు గురించి ఎన్నో రకాల వార్తలు వినిపిస్తున్నాయి.
ఇదే విషయం గురించి చర్చలు కూడా నడుస్తున్నాయి.తారకరత్న వైద్యానికి లక్షల్లో ఖర్చు అవుతోందని, అలాగే మెరుగైన చికిత్సను అందించడానికి ఇప్పటికే కోటి రూపాయలకు పైగా హాస్పిటల్ ఖర్చులు అయ్యాయని తెలుస్తోంది.
అయితే ఈ ఖర్చులను స్వయంగా నారా లోకేష్ భరిస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే ఈ విషయంలో నారా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ ఇద్దరు కూడా నందమూరి కుటుంబానికి ఆర్థికంగా అండగా ఉంటున్నారు అంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.ఇంకా ఎంత ఖర్చు అయినా ఆయన పూర్తి ఆరోగ్యంగా తిరిగి వచ్చే వరకు తమ బాధ్యతే అని మాటిచ్చినట్లు తెలుస్తోంది.తారకరత్నకు చికిత్స జరుగుతోన్న ఆస్పత్రిలోనే ఆయన భార్య అలేఖ్యా రెడ్డి, తండ్రి మోహనకృష్ణతో పాటు పలువురు కుటుంబ సభ్యులు ఉన్నారు.
చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఆసుపత్రికి చేరుకొని తారకరత్న ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు.నందమూరి కుటుంబ సభ్యులు అక్కడే ఉండి ఎప్పటికప్పుడు తారకరత్న ఆరోగ్యంపై ఆరాధిస్తూనే ఉన్నారు.