తండ్రి జయంతి సందర్భంగా ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసిన తారక్.. వైరల్ అవుతున్న పోస్ట్?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి కుటుంబానికి ఎలాంటి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయో మనకు తెలిసిందే.నందమూరి తారక రామారావు వారసుడిగా ఇండస్ట్రీలోకి బాలకృష్ణ హరికృష్ణ ఎంట్రీ ఇచ్చారు.

 Tarak Shared An Emotional Post On The Occasion Of His Fathers Birthday Is The Po-TeluguStop.com

అనంతరం హరికృష్ణ వారసులుగా కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఇండస్ట్రీలో కొనసాగుతూ ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.ఇకపోతే ఎన్టీఆర్ వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన హరికృష్ణ ఒకవైపు సినిమాలలో కొనసాగుతూనే మరోవైపు రాజకీయాలలో కూడా ఎంతో చురుగ్గా పాల్గొన్నారు.

ఇలా రాజకీయాలలోనూ సినిమాలలోను ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న హరికృష్ణ ఆగస్టు 29వ తేదీ రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం మనకు తెలిసిందే.అయితే నేడు హరికృష్ణ జయంతి కావడంతో ఆయన కుమారులు అభిమానులు హరికృష్ణ ను గుర్తుచేసుకొని తన 66వ జయంతి వేడుకలను నిర్వహించారు.

ఈ క్రమంలోనే తండ్రి జయంతి సందర్భంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు.

ఈ సందర్భంగా ఎన్టీఆర్ తన తండ్రి జయంతి సందర్భంగా ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.ఈ అస్తిత్వం మీరు.ఈ వ్యక్తిత్వం మీరు.

మొక్కవోని ధైర్యంతో కొనసాగే మా ఈ ప్రస్థానానికి నేతృత్వం మీరు.ఆజన్మాంతం తలచుకునే అశ్రుకణం మీరే అంటూ హరికృష్ణ ఫోటోని షేర్ చేస్తూ ఎమోషనల్ అయ్యారు.

ఇక ఎన్టీఆర్ షేర్ చేసిన ఈ పోస్ట్ ని కళ్యాణ్ రామ్ కూడా ట్విట్టర్ వేదికగా షేర్ చేస్తూ తన తండ్రిని గుర్తు చేసుకున్నారు.ప్రస్తుతం తారక్ షేర్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube