ఈ మధ్య కాలంలో సినీ ప్రముఖులు జాతీయ మీడియా పై తనదైన శైలిలో విరుచుకు పడుతున్నారు.కొందరు పరోక్షంగా విమర్శలు చేస్తుంటే మరి కొందరు మాత్రం నేరుగానే వారి పద్ధతి పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
డ్రగ్స్ కేసు విషయంలో మరియు సుశాంత్ మృతి కేసు విషయంలో జాతీయ మీడియా వ్యవహరిస్తున్న తీరు ఏ మాత్రం హర్షణీయం కాదంటూ బాలీవుడ్ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఒకరు ఇద్దరు చేస్తున్న విమర్శలను పట్టుకొని జాతీయ మీడియా మొత్తం కూడా బాలీవుడ్ చెడుగా చూపించేందుకు ప్రయత్నాలు చేస్తుంది అంటూ ఇప్పటికే కొందరు బాహాటంగానే విమర్శించడం జరిగింది.
తాజాగా హాట్ బ్యూటీ తాప్సీ కూడా తనదైన శైలిలో జాతీయ మీడియాను తీవ్రంగా విమర్శించింది.
ట్విట్టర్లో ఆమె విషయమై స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వం థియేటర్ల ఓపెన్ కి సిగ్నల్ ఇచ్చింది.50 శాతం ఆక్యుపెన్సీ తో థియేటర్లను ఓపెన్ చేసుకోవచ్చు అంటూ అనుమతులు జారీ చేసింది.కనుక ఇక ఎంటర్ టైన్ మెంట్ కు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు.
అందుకే ఇకపై అయినా మీరు 50% రియల్ న్యూస్ ఇవ్వండి అంటూ జాతీయ మీడియాను ఉద్దేశించి ఆమె వ్యాఖ్యలు చేసింది.ఆమె ఈ సందర్భంగా ఏ ఒక్క జాతీయ మీడియా పేరును లేవనెత్తే లేదు.
కానీ ఆమె ఈమద్య కాలంలో అతి చేసిన జాతీయ మీడియా ని ఆమె కౌంటర్ చేసిన విషయం మాత్రం అందరికీ స్పష్టంగా అర్థమవుతుంది.గత కొన్ని రోజులుగా జాతీయ మీడియాలో వచ్చిన బాలీవుడ్ కథనాలతో ప్రేక్షకులకు బాగా ఎంటర్టైన్మెంట్ ను ఇచ్చారు అనేది ఆమె ముఖ్య ఉద్దేశం.
ఇప్పటికి అయినా జాతీయ మీడియాలో కాస్త అయిన మార్పు వస్తుందా లేదా అనేది చూడాలి.దేశంలో ఎన్నో ముఖ్యమైన సమస్యలు ఉంటే డ్రగ్స్ కేసు పై కథనాలు ఏంటో అంటూ సామాన్యులు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.