బాలీవుడ్ లో చేసిన సినిమాల కంటే కాస్టింగ్ కౌచ్, మీటూ ఉద్యమంతో బాగా పాపులర్ అయిన నటి తనుశ్రీ దత్తా.ఈ చేసిన సినిమాలు చాలా తక్కువ అయితే అందాలు ఆరబోసిన సరైన గుర్తింపు రాకపోవడంతో సినిమాలకి గుడ్ బై చెప్పేసి అమెరికా వెళ్లి సెటిల్ అయిపొయింది.
ఆ మధ్యకాలంలో సడెన్ గా ఇండియాలో వాలిపోయి బాలీవుడ్ లో కొంత మంది ప్రముఖులపై కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసింది.కొంత కాలం ఆ ఆరోపణలతో తనుశ్రీ దత్తా మీడియాలో హడావిడి చేసింది.
మళ్ళీ అమెరికా వెళ్ళిపోయింది.అయితే చాలా కాలం తర్వాత మరల సినిమాలో రీ ఎంట్రీ ఇవ్వడానికి ఇండియాలో వాలిపోయింది.
రీఎంట్రీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుంది.ఈ విషయాన్ని ఆమె మీడియా ద్వారా తెలియజేసింది.
తాను ఐటీలో శిక్షణ పొందినట్లు పేర్కొన్నారు.శిక్షణ అనంతరం తనకు అమెరికన్ డిఫెన్స్లో జాబ్ వచ్చిందని, కానీ ఈ జాబ్లో చేరడానికి మూడేళ్ల కాంట్రాక్ట్ ఉండడంతో వెనుకాడుగు వేశానని చెప్పారు.
ఈ మూడేళ్లు అమెరికా వదిలి ఎక్కడికి వెళ్లడానికి వీల్లేదు.అయితే నటనపై ఉన్న ఆసక్తితో ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగ అవకాశాన్ని సైతం కాదనుకున్నట్లు తనుశ్రీ తెలిపారు.యాక్టింగ్ కెరీర్ను తిరిగి ప్రారంభించాలనే ఉద్దేశంతోనే ఏకంగా 15 కిలోల బరువు కూడా తగ్గినట్లు చెప్పారు.వచ్చిన వెంటనే సౌత్ నుంచి మూడు సినిమాలు ఆఫర్స్ వచ్చాయని పేర్కొంది.
ప్రస్తుతం ఈ సినిమాలు చర్చల దశలో ఉన్నాయని.ఇవే కాకుండా మరికొన్ని చిత్రాల్లో కీలక పాత్రల కోసం తనను ఫిల్మ్ మేకర్స్ సంప్రదిస్తున్నట్లు ఆమె తెలిపారు.
ఇప్పటికే తాను అంగీకరించిన కొన్ని సినిమాలు ప్రారంభం కావాల్సి ఉండగా, కరోనా మహమ్మారి వల్ల షూటింగ్ వాయిదా పడిందన్నారు.ఇటీవలే తాను ఓ ప్రచార చిత్రంలో నటించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆమె ప్రస్తావించారు.
మొత్తానికి రీ ఎంట్రీతో సౌత్ లో వెలిగిపోవాలని భావిస్తున్న ఈ బాలకృష్ణ హీరోయిన్ కెరియర్ ఎలా ఉండబోతుంది అనేది చూడాలి.
.