టాలీవుడ్ ప్రముఖ నటుడు, రచయిత, దర్శకుడు అయిన తనికెళ్ల భరణి గురించి మనందరికీ తెలిసిందే.తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్నో మంచి మంచి సినిమాల్లో నటించి నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు.
అదేవిధంగా ప్రతినాయకుడి పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించారు.ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు శివునిపై తనకున్న భక్తిని చూపిస్తూ కీర్తనలు, కవితలు, పాటలు రాస్తూ ఉంటారు.
తనికెళ్ల భరణి గొప్ప శివ భక్తుడు అన్న విషయం అందరికి తెలిసిందే.ఇక సినిమాల్లో తన విలక్షణమైన నటనతో ఎంతోమంది అభిమానుల మనసులలో స్థానం సంపాదించుకున్నారు.
ఇదిలా ఉంటే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న తనికెళ్ల భరణి తన జీవితంలో బెదిరింపులను ఎదుర్కొన్నారని తెలిపారు.ఇ.వి.వి.సత్యనారాయణ దర్శకత్వంలో హీరోయిన్ గా నటించిన సినిమా ఆమె.ఆమె అనే సినిమాలో ఊహ భావ క్యారెక్టర్ లో తనికెళ్ల భరణి నటించారు.ఇక సినిమాలో భాగంగా ఇందులో తనికెళ్ల భరణి కొంచెం బ్యాడ్ గా విలనిజం చూపించారు.ఆమెను అత్యాచారం చేసి పెళ్లి చేసుకుంటాడు.అయితే సినిమాలో అతని నటనకు గాను ఎంతో మంది ప్రశంసల వర్షం కురిపించారు.అదేవిధంగా అతనికి మంచి గుర్తింపు కూడా వచ్చింది.
అంతకు మించిన స్థాయిలో బెదిరింపులు కూడా వచ్చాయట.సినిమా అయిపోయి బయటకు వెళ్లిన తర్వాత చాలా మంది అతన్ని ఛీధరించుకోవడంతో పాటు, కనిపిస్తే రాళ్లతో దాడి చేయడం ఇక మహిళలు అయితే అతనిని చూస్తే చంపేస్తామంటూ బెదిరించేవారట.అది నిజం కాదు సినిమాలో ఒక సన్నివేశం మాత్రమే అని చెప్పినా కూడా వాళ్లు వినే వారు కాదట.అలా అప్పట్లో నటన అంటే ప్రేక్షకులు మమేకమైపోతారు అంటూ చెప్పుకొచ్చారు తనికెళ్ల భరణి.
ఈ విధంగా తన జీవితంలో జరిగిన ఒక భయంకరమైన అనుభవం గురించి చెప్పుకొచ్చారు.