మిథునం సినిమా గురించి చెప్పాలంటే ఒక ఇద్దరు వృద్ద దంపతుల మధ్య చివరి స్టేజ్ లో ప్రేమ అభిమానాలు ఎలా ఉంటాయి అని చూపించిన మూవీ ఇది ఈ సినిమాకి తనికెళ్ళ భరణి రైటర్ అండ్ డైరెక్టర్ గా వ్యవహరించారు…లక్ష్మి, బాలా సుబ్రమణ్యం ఇద్దరి మధ్యే నడిచే స్టోరీ ఇది రెండే క్యారెక్టర్స్ ని పెట్టీ సినిమా మొత్తం ఎమోషన్స్ మీద నడిపించాడు డైరెక్టర్.వాళ్లిద్దరి యాక్టింగ్ కూడా సూపర్ గా ఉంటుంది.
అయితే ఈ సినిమాకి బాలా సుబ్రమణ్యం కంటే ముందే తనికెళ్ళ భరణి ఎల్బీ శ్రీరామ్ గారితో చేస్తా అని చెప్పి వీళ్లిద్దరూ చాలా రోజులపాటు ఈ స్టోరీ మీద ట్రావెల్ అయ్యారు బేసిక్ గా తనికెళ్ళ భరణి, ఎల్బీ శ్రీరామ్ ఇద్దరు కూడా స్టేజ్ ఆర్టిస్టులు అవ్వడం వల్ల ఇండస్ట్రీకి రాకముందు నుంచే వాళ్లిద్దరూ మంచి ఫ్రెండ్స్ గా ఉండేవారు అదే చనువుతో మిథునం కథ కూడా ఎల్బీ శ్రీరామ్ ని పెట్టీ తీయాలి అనుకున్నాడు కానీ తీరా టైం కి ఎల్బీ శ్రీరామ్ ఇలాంటి క్యారెక్టర్స్ చాలా చేసాడు కాబట్టి ఫ్రెష్ గా ఉండడానికి కొత్త వాళ్ళని ట్రై చేద్దాం అనుకున్నప్పుడు బాలా సుబ్రమణ్యం అయితే బాగుంటుంది అనుకుని ఆయన్ని అప్రోచ్ అయ్యారు…ఆ స్టోరీ విన్న బాలా సుబ్రమణ్యం చేద్దాం అని చెప్పడం తో ఈ సినిమా తెరకెక్కింది…ఈ రోజుకి ఈ సినిమా ఒక మంచి సినిమాగా అందరికీ గుర్తుండి పోతుంది.
ఇక ఇది ఇలా ఉంటే భరణి గారు అలా బాలా సుబ్రమణ్యం గారిని పెట్టీ సినిమా చేయడంతో నాతో సినిమా చేస్తాను అని చెప్పి వేరే వాళ్ళతో సినిమా చేశాడు భరణి అని అనుకొని ఎల్బి శ్రీరామ్ ఆయన మీద కోపం తో ఉండడం వల్ల ఇద్దరు కొద్దిరోజులు మాట్లాడుకోలేదట మళ్ళీ అదంతా సహజంగా జరిగిపోతూనే ఉంటాయి వీటికోసం మా ఫ్రెండ్షిప్ నీ ఎందుకు దూరం చేసుకోవడం అనుకొని మళ్ళీ కలిసిపోయారు అంట…అయిన ఇండస్ట్రీ లో ఒకరితో సినిమా అనుకొని ఇంకొకరితో సినిమా చేయడం ఇది కొత్త ఏమికాదు…