అమెరికాలో అతిపెద్ద తెలుగు సంఘమైన తానా తాజాగా యోగాపై అవగాహన కోసం యోగా శిక్షణని ఏర్పాటు చేసింది.మార్చ్ 1 న ప్రారంభించిన ఈ యోగా శిక్షణా శిబిరానికి విశేష స్పందన లభించింది.
స్థానికంగా ఉన్న ఎంతో మంది తెలుగు వాళ్ళు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.యోగా గురువు సంజయ్ అత్తాడ ఆధ్వర్యంలో ఈ శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు.
యోగా నిత్యజీవితంలో భాగమవ్వాలని, యోగా ద్వారా మానసిక ప్రశాంతత కలుగుతుందని, అనారోగ్య సమస్యలు తలెత్తవని సంజయ్ అత్తాడ తెలిపారు.తానా అధ్యక్షుడు జయ్ తాళ్ళూరి మాట్లాడుతూ యోగా మెడిటేషన్ చేయడం వలన శరీరం ఎంతో ఉల్లాసంగా ఉంటుందని రోగాలు దరిచేరకుండా ఉంటాయని రోజు వారి ఒత్తిడుల నుంచీ ఉపశమనం కలుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగు వారు మాట్లాడుతూ తానా యోగా శిక్షణ శిబిరం ఏర్పాటు చేయడం ఎంతో సంతోషంగా ఉండదని.ఈ శిక్షణ శిబిరం ద్వారా ఎన్నో విషయాలు తాము తెలుసుకున్నామని మరిన్ని శిక్షణ కార్యక్రమాలు తాన ఏర్పాటు చేయాలని కోరారు.
విచ్చేసిన సభ్యులు అందరికి తానా సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.