దేశానికి వెన్నెముక రైతు.అలాంటి రైతు లు నేడు తమ పంటలని పండిస్తున్న క్రమంలో రసాయనిక ఎరువులని వాడుతూ తగు జాగ్రత్తలు తీసుకోవడం మరిచిపోతున్నారు.
దాంతో ఎన్నో రకాలుగా రైతులు అనారోగ్య సమస్యల్ని ఎదుర్కుంటున్నారు.ఈ క్రమంలోనే తానా ఏపీలో రైతుల కోసం నడుంబిగించింది.
వారి సంక్షేమం కోసం దాదాపు 3 వేల రూపాయలు విలువ చేసే కిట్లని ప్రస్తుతానికి 25 వేల మందికి ఇస్తున్నామని తెలిపింది.
అయితే మరో దశలో దాదాపు లక్ష మందికి ఈ కిట్లని అందించేలా ప్రణాలికలు సిద్దం చేసి ఉంచామని అన్నారు.పిచికారీ చేసే రసాయనాల ప్రభావం నుంచి తమను తాము రక్షించుకునేందుకు ఉపయోగపడే రక్షణ సామగ్రితో కూడిన కిట్లను రైతులకు ఉచితంగా అందజేస్తామని తానా అధ్యక్షుడు సతీష్ వేమన తెలిపారు.
రైతులు కనీస జాగ్రత్తలు తీసుకోకుండా రసాయనిక ఏర్పులని వాడటంతో అనారోగ్యానికి గురవ్వటంతో పాటు కొన్నిసార్లు మందుల తీవ్రతతో అక్కడికక్కడే ప్రాణాలు పోగొట్టుకున్తున్నారని ఆయన అన్నారు అందుకనే ఆ ప్రభావం నుంచీ తమని తాము కాపాడుకోవడానికి ఈ కిట్లని ప్రధానం చేస్తున్నట్టుగా ఆయన తెలిపారు.
తాజా వార్తలు