ఉత్తర అమెరికాలోని తెలుగు సంఘాలలో పెద్దదైన తానా.ఎన్నో చైతన్య కార్యక్రమాలు చేపడుతుంది అనే విషయం అందరికి తెలిసిందే అయితే ఎప్పటిలాగానే తానా రైతుల కోసం రెండేళ్ళకొకసారి నిర్వహించే రైతు చైతన్య కార్యక్రమాలని నిర్వహిస్తోంది.
రైతుల అభ్యున్నతి కోసం.ఎలాంటి చర్యలు చేపట్టాలో నిపుణుల ద్వారా తెలిపేలా కార్యక్రమాని డిజైన్ చేసింది.
ఏపీలో పలు చోట్ల తానా ఈ ఏడాది డిసెంబర్ 23 నుంచి జనవరి 12 వరకు పలు రకాల కార్యక్రమాలు వివిధ ప్రాంతాల్లో జరగనున్నాయని తానా తెలిపింది.ఇందులో రైతులకోసం ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది.అందుకోసం ఈ కార్యక్రమానికి “రైతుకోసం” అనే పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.ఇందులో భాగంగా
రైతులకి ప్రక్రుతి వ్యవసాయంపై వ్యవసాయంపై అవగాహన సదస్సులు, రసాయనవాడక నివారణ పద్ధతులు, రసాయన నివారణ పరికరాలు, భూ – పరీక్షా పరికరాల పంపిణీ వంటి రైతు సంభందిత కార్యక్రమాలని చేపట్టింది.
తాజా వార్తలు