తానా (ఉత్తర అమెరికా తెలుగు సంఘం)ప్రతీ ఏటా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే తన 22 వ మహాసభలన్ని ఈ సారి భారీస్థాయిలో నిర్వహిస్తోంది.జులై 4 నుంచీ అనగా ఈ రోజు మొదలు 6వ తారీకు వరకూ వాషింగ్టన్ డీసీ లో అంగరంగ వైభవంగా నిర్వహించ బడుతోంది.
ఈ కార్యక్రమానికి సినీ, ప్రముఖులు, రాజకీయ నేతలు ఎంతో మంది అతిరధ మహారధులు హాజరవుతున్నారు.అయితే
ప్రతీ ఏటా తానా తరుపున ఎంతో మంది ప్రముఖులకి అవార్డుల ప్రధానం చేస్తూ ఉంటారు.
ఈ దఫా ఎన్టీఆర్ కల్చరల్ అవార్డు కి ప్రముఖ రంగస్థల నటుడు గుమ్మడి గోపాలకృష్ణని ఎంపిక చేయగా, తానా గుత్తికొండ రవీంధ్రనాథ్ సర్వీస్ అవార్డ్ కోసం డాక్టర్ గంగా చౌదరిని ఎంపిక చేశారు.
అలాగే గిడుగు రామ్మూర్తి అవార్డ్ కి డాక్టర్ గారపాటి ఉమామహేశ్వరరావును ఎంపిక చేసినట్లుగా తెలిపారు.అంతేకాక ఎంతో ప్రతిష్టాత్మక తానా జీవన సాఫల్య పురస్కారాన్ని ఎన్టీవీ చైర్మన్ తుమ్మల నరేంద్ర చౌదరి కి ఇవ్వనున్నట్లుగా తెలిపారు.ఈ అవార్డులని వాషింగ్టన్ తానా వేదికపై అందచేస్తామని మరిన్ని వివరాలకి వెబ్సైట్లో చూడవచ్చని తెలిపారు.