కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది.ఈ వైరస్ అడుగు పెట్టిన చోట మారణహోమం జరుగుతోంది.
లెక్కకి మించిన కేసులు వివిధ దేశాలలో నమోదు అవడమే కాకుండా మృతి చెందుతున్న వారి సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతోంది.ఇదిలాఉంటే.
కరోనా దెబ్బకి అగ్ర రాజ్యం సైతం అల్లలాడిపోతోంది.కరోనాని సమర్ధవంతంగా ఎదుర్కుంటామని, భయపడమని బీరాలు పలికిన ట్రంప్ సైతం కరోనా టెస్ట్ చేయించుకున్నారంటే కరోనా ఎఫెక్ట్ ఏ రేంజ్ లో ఉందో అర్ధం చేసుకోవచ్చు.
అమెరికాలో ప్రస్తుతం కరోనా మరణాలు అధికమవుతుండటంతో ప్రభుత్వం అక్కడి స్కూల్స్, కాలీజీలు, షాపింగ్ మాల్స్, ఎన్నికల ప్రచారాలు అన్నిటికి కొంత కాలం పాటు విరామం ఇచ్చాయి.ఎవరూ కూడా గుంపులు గుంపులుగా ఉండే ప్రాంతాలకి వెళ్ళద్దని హెచ్చరిస్తున్నారు.
ఈ ప్రస్తుత పరిస్థితులలో అమెరికాలో ఉంటున్న భారతీయ విద్యార్ధులు అందోళన వ్యక్తం చేస్తున్నారు.ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు.దాంతో అమెరికాలో అతి పెద్ద తెలుగుసంఘం అయిన తానా ( ఉత్తర అమెరికా తెలుగు సంఘం)
తెలుగు విద్యార్ధులకి ఆశ్రయం కల్పించడానికి ముందుకు వచ్చింది.కాలీజీలు, యూనివర్సిటీ లు మూత పడటం వలన ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో ఆ భారతీయ విద్యార్ధులకి ఆశ్రయం కలిపిస్తామని ప్రకటించింది.అందుకు గాను టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చింది.1-855-OUR- TANA హెల్ప్ లైన్ నెంబర్ కి ఫోన్ చేస్తే వెంటనే తానా సభ్యులు స్పందిస్తారని తెలిపింది.
.