బాబు ఎంత జుట్టు పీక్కున్నా అదే జరగడం ఖాయం

ఏపీ ప్రభుత్వం రాష్ట్రానికి మూడు రాజధానులు అవసరం అనే ఉద్దేశ్యంలో ఉన్న విషయం తెల్సిందే.సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి ఇప్పటికే అమరావతి మాత్రమే కాకుండా వైజాగ్‌ మరియు కర్నూలును రాజధానులుగా చేయబోతున్నట్లుగా అనధికారికంగా చెప్పుకొచ్చాడు.

 Tammineni Sitaram Chanandrababu Naidu Ysrcp Ys Jagan Tdp-TeluguStop.com

ఈ నేపథ్యంలో తెలుగు దేశం పార్టీ మరియు అమరావతి ప్రాంత రైతులు తీవ్ర స్థాయిలో ఆందోళనలు చేస్తున్నారు.తెలుగు దేశం పార్టీ ఆధ్వర్యంలో ప్రతి రోజు ఏదో ఒక రూపంలో ప్రభుత్వంకు వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్నాయి.

ఈ సమయంలో స్పీకర్‌ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ చంద్రబాబు నాయుడుపై తీవ్ర వ్యాఖ్యలు చేశాడు.

మాజీ సీఎం చంద్రబాబు నాయుడు త్వరలో తీహార్‌ జైలుకు వెళ్లడం ఖాయం, అప్పుడు వైజాగ్‌ను ఒక రాజధానిగా ప్రభుత్వం ఏర్పాటు చేయడం కూడా ఖాయం అన్నాడు.

ఏం చేసినా, ఎంత జుట్టు పీక్కున్నా కూడా చంద్రబాబు అనుకునేది కాదని, రాష్ట్రంలో అభివృద్ది వికేంద్రీకరణ కోసం జగన్‌ చేస్తున్న ప్రయత్నాలను ప్రతి ఒక్కరు సమర్థించాల్సిందే అంటూ స్పీకర్‌ అన్నారు.చంద్రబాబు నాయుడు అనాలోచితంగా తన స్వార్థం కోసం రాజధాని ప్రాంత రైతులను రెచ్చగొడుతున్నాడు అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube