మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలకు పనికి రాడు అని తాను ముందే చెప్పాను అంటూ తాజాగా దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సంచలన వ్యాఖ్యలు చేశాడు.‘ప్రజారాజ్యం’ పార్టీని ప్రారంభించే ముందు తాను చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్లక పోవడమే మంచిది అన్నాను అని, కాని తన వ్యాఖ్యలు ఏ ఒక్కరు కూడా పెద్దగా పట్టించుకోలేదు అని తమ్మారెడ్డి చెప్పుకొచ్చాడు.
ఇక చిరంజీవితో తనకు ఉన్న విభేదాల గురించి మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవం అని, తమ మధ్య విభేదాలు లేవు అని, చెన్నైలో ఉన్న సమయంలో చిరంజీవి తన ఆఫీస్కు అప్పుడప్పుడు వచ్చే వాడు అని, తాను కూడా చిరంజీవిని కలిసే వాడిని అని, కాని చిరంజీవి స్టార్ అయ్యాక కలుసుకోవడం తగ్గింది అని ఈయన వ్యాఖ్యానించాడు.ఇప్పుడు చిరంజీవి దగ్గరకు వెళ్లాలి అంటే తన ఈగో అడ్డు పడుతుందని తమ్మారెడ్డి చెప్పుకొచ్చాడు.
అయితే చిరంజీవిపై తనకు ఎలాంటి కోపం లేదు అని, తామిద్దరం కూడా బాహాటంగా ఎప్పుడు విభేదించుకోలేదు అని తమ్మారెడ్డి చెప్పుకొచ్చాడు.