ప్రస్తుతం టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా అన్ని వుడ్లలో కూడా బయోపిక్ల సీజన్ నడుస్తోంది.పెద్ద ఎత్తున ప్రముఖుల బయోపిక్లు రూపొందుతున్నాయి.
ఇలాంటి సమయంలో తెలుగులో రూపొందిన ‘ఎన్టీఆర్’ బయోపిక్పై దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ చిత్రం తీవ్రంగా నిరాశ పర్చింది.
సినిమా మొదటి పార్ట్ కొంత పర్వాలేదు అన్నట్లుగా ఉన్నా రెండవ పార్ట్ పూర్తిగా అప్పటి సినిమా క్లిప్పింగ్స్ను రీ షూట్ చేసినట్లుగా ఉందని ఎద్దేవ చేశాడు.
ఇక ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రాన్ని ఎలా చేశారో అంటూ తమ్మారెడ్డి అనుమానం వ్యక్తం చేశాడు.మరో వైపు లక్ష్మీస్ ఎన్టీఆర్ అంటూ ఎన్టీఆర్ గారి జీవిత చరిత్రను తీస్తానంటూ మరో సినిమారాబోతుంది.ఆ సినిమా ట్రైలర్ తో తెగ హడావుడి చేస్తున్నారు.
ఎన్టీఆర్ గారి జీవితం చివర్లో అసలేం జరిగిందో ఎవరికి తెలియదు.ఆ విషయాలపై చాలా మందిలో ఆసక్తి ఉంది.
ఆయన అభిమానులు ఎంతో మంది ఆయనను ఇప్పటికి దేవుడుగా పూజిస్తూ ఉన్నారు.అయితే బయోపిక్ల పేరుతో ఎన్టీఆర్ పరువును బజారుకు ఈడుస్తున్నారు.
ఇప్పటి వరకు ఎన్టీఆర్ గురించి తెలియని విషయాలను తెలియజేస్తున్నాం అంటూ ఆయన పరువు తీసేలా బయోపిక్లు తీస్తున్నారు అంటూ తమ్మారెడ్డి అంటున్నాడు.నాలాంటి అభిమానులు ఎంతో మంది ఈ బయోపిక్ల వల్ల తీవ్ర మనోవేదనకు గురి అవుతున్నారు.ఇలాంటి బయోపిక్ల పరిస్థితి ఏంటో కాని అభిమానులు మాత్రం తీవ్రమైన గందరగోళ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.అభిమానులు కన్నీరు పెట్టుకునేలా బయోపిక్లు ఉంటున్నాయని తమ్మారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశాడు.