మా లో ఉన్న గొడవలు మెల్ల మెల్లగా పెద్దవి అవుతూ వస్తున్నాయి.నరేష్ అధ్యక్షుడిగా ఎన్నిక అయిన కొన్ని రోజులకే ఉపాధ్యక్షుడిగా ఉన్న రాజశేఖర్ తన వ్యతిరేక గళం వినిపించడం మొదలు పెట్టాడు.
కాని ఎప్పుడైతే నరేష్ ఈయన్ను పక్కకు పెట్టడం మొదలు పెట్టాడో రాజశేఖర్ మరింతగా రెచ్చి పోవడం చేశాడు.మా లో గొడవలు ఉన్నాయి అని అందరికి తెల్సిందే.
కాని తాజాగా మా డైరీ విడుదల సందర్బంగా చిరంజీవి ముందే రాజశేఖర్ గొడవకు తెర తీశాడు.మా లో ఉన్న గొడవలను దాచే ప్రయత్నాలు చేస్తున్నారంటూ విమర్శలు గుప్పించాడు.
పెద్దల ముందు ఈ గొడవ విషయాన్ని మీడియా ముందుకు తీసుకు రావడంపై రాజశేఖర్పై విమర్శలు కురుస్తున్నాయి.చిరంజీవి మరియు మోహన్ బాబులు కూడా రాజశేఖర్ తీరును తప్పుబట్టారు.
కాని కొందరు మాత్రం రాజశేఖర్ చేసిన పని మంచిదే అంటున్నారు.ముఖ్యంగా నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజా మాట్లాడుతూ ఇన్ని రోజులు గొడవలు రహస్యంగానే ఉన్నాయి.
ఇప్పుడు ఈ విషయంతో బయట పడ్డాయి.కనుక ఇకపై అయినా ఈ గొడవలు లేకుండా పెద్దలు చిరంజీవి వంటి వారు చూస్తారని తమ్మారెడ్డి అన్నాడు.
చిరంజీవి ముందు ఉండి మా ని నడిపించాలి.లేదంటే ముందు ముందు మరింతగా ఈ వివాదం ముదురుతుందని అన్నాడు.