తమిళనాడు పళ్లిపట్టు సమీపం గాజులకండ్రిగకు చెందిన రమేష్ మూడు సంవత్సరాల క్రితం ఉపాధి నిమిత్తం తిరుపతికి వచ్చాడు.అక్కడే ఉంటూ నిత్యం టూరిస్ట్ బస్సులను శుభ్రం చేస్తూ, ప్రైవేటు జీపులకు లోడ్ చేస్తూ వచ్చే సంపాదనతో జీవించేవాడు.
అయితే రాత్రికి రాత్రి ఏమైందో తెలియదు సోమవారం ఉదయం రమేశ్ విగతజీవిగా పడి ఉన్నాడు.అది చుసిన స్థానికులు అలిపిరి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని పరిశీలించారు.అయితే ఆ తమిళ్ యువకుడుని ఆదివారం రాత్రి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు తలపై బలమైన ఆయుధాలతో కొట్టి హత్య చేశారని ప్రాధమిక విచారణలో వెల్లడైంది.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అలిపిరి సమీపంలోని బాలాజీ టూరిస్టు లింకు బస్టాండులో కొందరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.