కరోనా కేసులు పెరుగుతుండటంతో తమిళనాడు ప్రభుత్వం సంచలన నిర్ణయం..!!

దేశంలో ఊహించనివిధంగా ఒక్కసారిగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూ ఉండటంతో సెకండ్ వేవ్ ఇండియాలో స్టార్ట్ అయిందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.వైరస్ ఎక్కువ విజృంభిస్తున్న రాష్ట్రాలలో ఇప్పటికే వైద్య సదుపాయాలు తక్కువ పరిస్థితి కనబడుతోంది.

 Tamilnadu Sensational Decision Due To Covid Maharashtra, Gujarat, Tamilnadu, Tel-TeluguStop.com

దీంతో మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తర ప్రదేశ్, ఢిల్లీ వంటి చోట్ల రాత్రి పూట కర్ఫ్యూ విధిస్తూ ఉన్నాయి.ఇదిలా ఉంటే తాజాగా తమిళనాడు రాష్ట్రంలో కూడా కేసులు పెరిగిపోతూ ఉండటంతో అక్కడి రాష్ట్రప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది.

మేటర్ లోకి వెళ్తే ఇక నుండి సినిమా థియేటర్లు 50 శాతం మాత్రమే నింపాలని యాజమాన్యాలకు తెలియజేసింది.

ప్రస్తుతం అన్ని సినిమా థియేటర్లు ఏసీ కలిగి ఉండటంతో థియేటర్ మొత్తం నిండిపోతే వారిలో ఎవరికైనా వైరస్ ఉంటే సినిమా థియేటర్ కి వచ్చే ప్రతి ఒక్కరికీ వైరస్ సోకే ప్రమాదం ఉండటంతో తమిళనాడు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

ఇదిలా ఉంటే మరి కొద్ది రోజుల్లో భారీ ఎత్తున పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యే పరిస్థితి ఉండటంతో.తమిళనాడులో అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో థియేటర్ల విషయంలో ఆంక్షలు విధించే విధంగా పరిస్థితులు మారటంతో పెద్ద సినిమాల నిర్మాతలు టెన్షన్ పడుతూ ఉన్నారు.

రేపు పవన్ నటించబోయే వకీల్ సాబ్ భారీ ఎత్తున రిలీజ్ కానుంది.దీంతో ఇప్పటికే తమిళనాడులో 50 శాతం మాత్రమే థియేటర్ లు  ఓపెన్ అయ్యేలా ఉండాలని అక్కడి ప్రభుత్వం తెలియజేయగా.

ఈరోజు సాయంత్రం తెలంగాణ ప్రభుత్వం కూడా హైకోర్టు ఆదేశాల మేరకు థియేటర్ల విషయంలో కఠినమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు టెన్షన్ లో సినిమా యూనిట్ వున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube