కరోనా టైం లో ఓ పెళ్లి జంట తమ మంచి మనసు చాటుకుంది.పెళ్లి ఖర్చు 50 లక్షల దాకా వేసుకున్న ఈ జంట పెళ్లిని 13 లక్షల్లో పూర్తి చేసి మిగతాది కరోనా బాధితుల సహాయార్ధం విరాళాలు అందించారు.
కరోనా సంక్షోభంలో ఈ జంట తీసుకున్న ఈ నిర్ణయానికి అందరు అభినందిస్తున్నారు.అంతేకాదు ఎంతోమందికి వీరు ఆదర్శంగా నిలిచారు.
తమ పెళ్లిని తక్కువ ఖర్చుతో జరుపుకుని మిగతా డబ్బు విరాళం ఇవ్వాలన్న ఆలోచన అందరు సూపర్ అనేలా చేసింది.తిరుప్పూర్ కు చెందిన అరుల్ ప్రాణేష్, అను ఇటీవలే పెళ్లి చేసుకున్నారు.
వారి పెళ్లికి 50 లక్షల ఖర్చు అవుతుందని అంచనా వేసుకున్నారు.అయితే ఈ టైం లో అంత ఖర్చు ఎందుకు అనుకుని తమ పెళ్లిని వీలైనంత తక్కువలో చేసుకున్నారు.
అలా చేసుకున్న వీరి పెళ్లి ఖర్చు 13 లక్షలు అయ్యిందట.మిగిలిన డబ్బుని కరోనా సహాయక చర్యలకు అందించాలని నిర్ణయించుకున్నారు.
పెళ్లికి అతిథులను, బంధు మిత్రులను భారీగా పిలిచే అవకాశం లేదు.అయినా సరే పిలిచిన కొందరు కూడా కొవిడ్ వల్ల తక్కువగా వచ్చారు.మ్యారేజ్ హాల్ ఓనర్ కూడా అడ్వాన్స్ తిరిగి వెనక్కి ఇచ్చేశారట.దీనితో అరుల్, అనులు తిరుప్పూర్ లో వట్టెమాలై అంగళమ్మన్ ఆలయంలో తక్కువమంది సమక్షంలో పెళ్లి చేసుకున్నారు.
వీరి పెళ్లి ఖర్చు 13 లక్షలు కాగా మిగిలిన 37 లక్షలను విరాళంగా ఇచ్చేశారు.ప్రభుత్వ కార్యకలాపాలకు, స్వచ్చంద సేవా సంస్థల కార్యక్రమాలకు ఉపయోగించేలా ఆ డబ్బుని స్థానిక రోటరీ క్లబ్ కు ఇచ్చారు.