కొంతమంది విచిత్రంగా ఆలోచిస్తారు.విచిత్ర పనులు చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు.
కొంతమంది పాపులర్ అవ్వం కోసమే విచిత్ర పనులు చేస్తే… కొంతమంది తాము అనుకున్నది సాధించేది వరకు వింతగా ఆలోచిస్తారు.ఈ వార్త కూడా అలాంటి కోవకు చెందినదే.
తాము అనుకున్నది సాధించేంత వరకు కొంతమంది వెనుకాడరు.సాధించేంత వరకు కష్టపడుతూనే ఉంటారు.
ఎన్ని సమస్యలు వచ్చినా లక్ష్యాన్ని వదిలిపెట్టారు.ఇప్పుడు అలాంటి ఒక విషయం గురించి తెలుసుకుందాం.
కొంతమంది తమకు ఇష్టమైన స్కూటీ, బైక్ కొనేందుకు చిల్లర నాణేలను పొగు చేసి తాము అనుకున్నది సాధించిన ఘటనలు చాలానే చూశాం.ఇప్పుడు ఒక వ్యక్తి అయితే అంతకుమించి చేశాడు.
స్కూటీ, బైక్ అనుకుంటే పొరపాటే.ఏకంగా చిల్లర నాణేలతో కారునే కొనేశాడు. ఈ వింత సంగటన తమిళనాడులో చోటుచేసుకుంది.తమిళనాడుకి చెందిన వెట్రివేల్ అనే వ్యక్తి రూ.10 నాణేలను కొన్ని సంవత్సరాలుగా పొగు చేస్తున్నాడు.దాదాపు రూ.6 లక్షల వరకు పొగు చేశాడు.వాటితో చివరికి తనకు నచ్చిన కారుని కొనుగోలు చేశాడు.
అయితే అతడు అది ఎందుకు చేశాడో చూస్తే షాక్ అవుతారు.అతడి అమ్మ షాపు నడుపుతోంది.కస్టమర్ల రూ.10 నాణేలు తీసుకోవడానికి ఇష్టపడటం లేదు.
దీంతో రూ.10 నాణేలు అలాగే ఉండిపోయాయి.అవి రూ.10 లక్షలకు చేరాయి.దీంతో వాటితో కారు కొనుగోలు చేసినట్లు స్పష్టం చేశారు.రూ.10 నాణేలు చెల్లవని చాలామంది ఫీల్ అవ్వుతున్నారని, వాటి విలువ ఉందని అందరికీ అవగాహన కల్పించేందుకు ఇలా చేశానని చెబుతున్నాడు.రూ.10 నాణేలకు విలువ లేనప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎందుకు తీసుకొచ్చిందని, ప్రజలకు దీనిపై ఎందుకు అవగాహన కల్పించడం లేదని ప్రశ్నిస్తున్నాడు.