సంక్రాంతి పండగ రాబోతుంది.తెలుగు రాష్ట్రలో ఈ పండగను ఘనంగా జరుపుకుంటారు.ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో కోళ్ళ పందెంలు జరుగుతాయి.లక్షలల్లో బెట్టింగ్స్ వేస్తూ ఉంటారు.పక్క రాష్ట్రం అయిన తమిళనాడులో సంక్రాంతి పండగను వారు అక్కడ పొంగల్ గా సెలబ్రేట్ చేసుకుంటారు.అందుకు వారి పురాతన క్రీడా అయిన జల్లికట్టు ను జరిపిస్తారు.
అందుకోసం మదం ఎక్కిన ఎడ్లను ఈ ఆటలో ప్రవేశపెడుతారు.వాటిని లొంగ దీసుకునేందుకు యువకులు వాటి వెంటపడుతారు.
ఆ సమయంలో చాలా మందికి గాయాలు అవ్వుతాయి ప్రాణాలు కూడా పోతాయి కావున ఇంత డేంజర్ ఆట అయిన జల్లికట్టు ను బ్యాన్ చేస్తునట్లుగా గతంలో సుప్రీం కోర్టు తీర్పు చెప్పడంతో తమిళ ప్రజలు నాయకులు, సినిమా నటులు అందరు గళమెత్తి అది మా పురాతన కాలంనాటి నుండి వస్తున్న సంప్రదాయ క్రీడా దానిని మేము వదులుకోము అని ధర్నాలు నిరసనలు చేసేసరికి తమిళనాడు ప్రభుత్వం చట్ట సవరణ చేసి నిషేదాన్ని ఎత్తి వేసింది.
ఇప్పుడు వచ్చే ఏడాది జల్లికట్టు ఆటకు తమిళనాడు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
కరోనా ఉన్న నేపథ్యంలో కేవలం 300 మంది మాత్రమే పాల్గొనాలని, ఆటకు ముందు వారు తమ కరోనా నెగటివ్ సర్టిఫికెట్స్ చూపించాలని కోరింది.అలాగే 50 శాతం జనాలతో మాత్రమే ఆట జరగాలని కోరింది అలాగే మాస్క్స్ అండ్ సానిటైజర్స్ వాడుతూ సోషల్ డిస్టెన్స్ పాటించాలని కోరింది.