ఎన్నికల ప్రచారం అంటే కేవలం వారు చేసిన, చేయబోతున్న అభివృద్ధి గురించి మాత్రమే మాట్లాడాలి.కానీ కలుషితమైన రాజకీయాల్లో నేటి కాలంలో జరుగుతున్న ప్రచారాలు ఎక్కువగా వ్యక్తిగత దూషణలతో పాటుగా, ఓటర్లను మభ్యపెట్టేలా ఉంటున్నాయి.
ఇలాంటి ఘటనే తమిళనాడు ఎన్నికల ప్రచారంలో కూడా చోటు చేసుకుందట.
తమిళనాడు సీఎం పళనిస్వామి తల్లి పై డీఎంకే నేతలు ఏవేవో మాట్లాడుతూ కించపరుస్తూ, వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని వేదన చెందుతున్న సీఎం పళనిస్వామి, చెన్నై తిరువొత్తియూరులో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఈ వ్యాఖ్యలపై స్పందిస్తూ కంటతడి పెట్టుకున్నారు.
తన తల్లి గ్రామీణ ప్రాంతంలో ఉండేవారని, కన్నుమూసిన ఆమె గురించి కించపరుస్తూ మాట్లాడుతున్న వారికి భగవంతుడు తగిన శిక్ష వేస్తాడని కన్నీటి పర్యాంతం అయ్యారు.
ఇదిలా ఉండగా డీఎంకే ఎ.రాజాపై కేంద్ర నేర విభాగ పోలీసులు, అనుచిత వ్యాఖ్యలు చేశారన్న అభియోగాలపై కేసు నమోదు చేశారు.అయినా రాజకీయాల్లో వ్యక్తిగత దూషణలు చేయకుంటే కొందరికైతే పొద్దే గడవదు.
మరి ఇలాంటి వాళ్ల వల్ల ప్రజలకు ఏం మంచి జరుగుతుందో గమనించుకోవాలి అని అనుకుంటున్నారట.