తల్లిని కించపరిచేట్లుగా చేసిన వ్యాఖ్యలపై కంటతడి పెట్టుకున్న సీయం.. ?

ఎన్నికల ప్రచారం అంటే కేవలం వారు చేసిన, చేయబోతున్న అభివృద్ధి గురించి మాత్రమే మాట్లాడాలి.కానీ కలుషితమైన రాజకీయాల్లో నేటి కాలంలో జరుగుతున్న ప్రచారాలు ఎక్కువగా వ్యక్తిగత దూషణలతో పాటుగా, ఓటర్లను మభ్యపెట్టేలా ఉంటున్నాయి.

 Tamilnadu Cm Palani Swamy Sheds Tears Over Comments Made On His Mother , Tamilna-TeluguStop.com

ఇలాంటి ఘటనే తమిళనాడు ఎన్నికల ప్రచారంలో కూడా చోటు చేసుకుందట.

తమిళనాడు సీఎం పళనిస్వామి తల్లి పై డీఎంకే నేతలు ఏవేవో మాట్లాడుతూ కించపరుస్తూ, వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని వేదన చెందుతున్న సీఎం పళనిస్వామి, చెన్నై తిరువొత్తియూరులో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఈ వ్యాఖ్యలపై స్పందిస్తూ కంటతడి పెట్టుకున్నారు.

తన తల్లి గ్రామీణ ప్రాంతంలో ఉండేవారని, కన్నుమూసిన ఆమె గురించి కించపరుస్తూ మాట్లాడుతున్న వారికి భగవంతుడు తగిన శిక్ష వేస్తాడని కన్నీటి పర్యాంతం అయ్యారు.

Telugu Raja, Admk, Cm Palani Swamy, Palaniswamy, Sheds Tears, Tamil Nadu, Tamiln

ఇదిలా ఉండగా డీఎంకే ఎ.రాజాపై కేంద్ర నేర విభాగ పోలీసులు, అనుచిత వ్యాఖ్యలు చేశారన్న అభియోగాలపై కేసు నమోదు చేశారు.అయినా రాజకీయాల్లో వ్యక్తిగత దూషణలు చేయకుంటే కొందరికైతే పొద్దే గడవదు.

మరి ఇలాంటి వాళ్ల వల్ల ప్రజలకు ఏం మంచి జరుగుతుందో గమనించుకోవాలి అని అనుకుంటున్నారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube