రోజు రోజుకి పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ రేట్లు సామాన్య ప్రజలకు మోయలేని భారంగా తయారవుతున్నాయి.గత కొద్దికాలంగా ధరలు పెంచుకుంటూ పోవడమే కాని తగ్గించిన సందర్భాలు చాలా తక్కువే అని చెప్పాలి.
అన్ని రాష్ట్రాల్లో లీటర్ పెట్రోల్ ధర సెంచరీ దాటేసింది.హిస్టరీలో ఎప్పుడూ లేనిది లీటర్ పెట్రోల్ 105, 106 రూపాయల దాకా వెళ్లింది.
పెట్రోలియం ఉత్పత్తులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న పన్ను సామాయలకు భారంగా మారాయి.ఈ క్రమంలో తమిళనాడ్ సీఎం స్టాలిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
పెట్రోల్ పై రాష్ట్ర ప్రభుత్వం వేస్తున్న పన్ను 3 రూపాయలు తగ్గించారు.
శుక్రవారం జరిగిన అసెంబ్లీ మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది.
పెట్రోల్ పై 3 రూపాయలు తగ్గించగా డీజిల్ పై మాత్రం ఎలాంటి తగ్గింపు ప్రకటించలేదు.లీటర్ పై 3 రూపాయల దాకా తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం పై 1160 కోట్ల మేర భారం వేసుకుంటుంది. చెన్నైలో లీటర్ ధర 102 కాగా లీటర్ డీజిల్ 94.39 గా ఉంది.శనివారం నుండి తగ్గించిన ధర అమల్లోకి వస్తుందని అంటున్నారు.ఇదే కాకుండా మహిళలకు ఫ్రీ బస్ ట్రాన్స్ పోర్ట్, మాతృత్వ సెలవులను 9 నెలల నుండి 12 నెలలకు పంచడంతో పాటుగా ట్రాన్స్ జెండర్ల కు పెన్షన్ లాంటివి సీఎం స్టాలిన్ ప్రకటించారు.