భార్య మరణం తట్టుకోలేని భర్త ఇంట్లోనే భార్య విగ్రహం ప్రతిష్ట...!

పెళ్లి తర్వాత జీవితాంతం ప్రతి విషయంలో తోడుండే భార్య భర్తలు అందులో ఏ ఒక్కరు మరణించిన మిగతా జీవితం ఎడబాటుతో చాలా బాధగా గడుపుతారు.అయితే ఈ మధ్య కొంతమంది వారి భార్యలను గుర్తుపెట్టుకోవడానికి వివిధ రకాల ప్రయత్నాలు చేస్తున్నారు.

 Tamilnadu Business Man Installs Wife Statue In Home, Wife Death, Husband, Tamiln-TeluguStop.com

ఇదివరకే బళ్లారి నగరంలో తన భార్యను మర్చిపోలేని వ్యక్తి అచ్చం తన భార్య ను పోలి ఉన్న మైనపు బొమ్మను తయారు చేసి ఇంట్లో ఉంచుకున్న సంగతి విదితమే.

ఇక తాజాగా తమిళనాడు రాష్ట్రం మదురై జిల్లాలో సేతురామన్ అనే వ్యక్తి తన భార్య ఎడబాటును భరించలేక ఇంట్లో తన భార్య కు సంబంధించిన విగ్రహాన్ని ఏర్పాటు చేయించుకున్నాడు.

సేతు రామన్ తన భార్యతో ఎంతో ఆనందంగా జీవించేవారు.వృద్ధాప్యంలో కూడా వారు కలిసిమెలిసి ఆనందంగా జీవించేవారు.ఇటీవల సదరు వ్యాపారి భార్య మణియమ్మల్ మరణించింది.దీంతో భర్త, తన భార్య మరణాన్ని భరించలేక పోవడంతో ఆవిడ జ్ఞాపకార్ధం కేవలం నెల రోజుల్లోనే తన భార్య కు సంబంధించిన విగ్రహాన్ని ఏర్పాటు చేయించుకున్నారు.

తన భార్య ఒక కుర్చీ లో కూర్చున్నట్టుగా విగ్రహాన్ని తయారు చేయించి ఇంట్లో పెట్టుకున్నాడు.ఈ విగ్రహం కోసం ఫైబర్, రబ్బర్ తో కలిపి విగ్రహాన్ని తయారు చేయించాడు.

ప్రతిరోజు ఉదయం లేవగానే తన భార్యకి పూజలు చేస్తూ భార్య పైన తనుకున్న ప్రేమానురాగాలను తెలియజేస్తున్నారు.ఇందుకు సంబంధించింది భర్త సేతురామన్ మాట్లాడుతూ… తన భార్యని విడిచి ఒక్క రోజు కూడా ఉండలేదని, ఇప్పుడు తను తనతో లేకపోవడం భరించలేక పోయానని అందుకోసమే ఆమెని రోజు తన పక్కనే ఉండే విధంగా తన భార్య విగ్రహం తయారు చేయించుకొని ఇంట్లో కి తెచ్చుకున్నానని ఆయన తెలియజేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube