ప్రస్తుతం ఉన్న ఆదాయ మార్గాల్లో యూట్యూబ్ నెంబర్ వన్ స్థానంలో ఉంది అంటే అతిశయోక్తి కాదేమో.పిల్లల నుండి పెద్ద వాళ్ళ వరకు ఉదయం మొదలు కొని రాత్రి వరకు యూట్యూబ్ లో ఏదో ఒకటి చూస్తున్న ఉంటాం.
దీని నుండి ఆదాయం బాగా వస్తుందని చాలా మంది యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేస్తారు.అందుకే యూట్యూబ్ లో కొన్ని లక్షల అకౌంట్ లు ఉన్నాయి.
లెక్క లేకుండా పెడుతున్నారని యూట్యూబ్ కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎక్కువుగానే పెడుతుంది.అందుకే ఈ మధ్య యూట్యూబ్ క్లిక్ అవ్వాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది.ఒక వీడియో లక్ష మంది వ్యూస్ రావడానికే చాలా కష్టపడాలి.ఇంకా సబ్ క్రైబర్స్ కోసం ఎంత కష్టపడాలో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
కానీ ఒక లోకల్ ఛానెల్ ఇప్పుడు యూట్యూబ్ లో రికార్డ్ క్రియేట్ చేసింది.
కోటి మంది సబ్ క్రైబర్స్ తో సరికొత్త రికార్డ్ నెలకొల్పింది.
అసలు ఆ ఛానెల్ ఏంటో తెలుసా ఇది తమిళ భాషకు చెందిన లోకల్ ఛానెల్.విలేజ్ కుక్కింగ్ పేరుతొ అందరిని ఆకట్టుకుంటూ అతి తక్కువ సమయంలోనే 10 లక్షల మంది సబ్ క్రైబర్స్ తో యూట్యూబ్ లో రికార్డ్ క్రియేట్ చేసింది.
దీనికి ఒకరకంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అని కూడా చెప్పుకుంటున్నారు.
ఈ ఛానెల్ పెట్టిన కొన్ని రోజుల తర్వాత రాహుల్ గాంధీ తో కలిసి ఒక వీడియోను చేసారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ గాంధీ ఈ ఛానెల్ వాళ్లతో కలిసి ఒక వీడియోలో కనిపించరు.అంతేకాదు వారి చేసిన వంటను కూడా టేస్ట్ చేసాడు.
దీంతో ఆ వీడియో కాస్తా వైరల్ గా మారి ఈ ఛానెల్ గురించి చాలా మందికి తెలిసింది.దీంతో స్టార్ట్ చేసిన మూడు సంవత్సరాలకే కోటికి పైగానే సబ్ క్రైబర్స్ తో దూసుకు పోతుంది.
గ్రామీణ వంటకాలను చూపించడం ఈ ఛానెల్ ప్రత్యేకత.కోటి సబ్ క్రైబర్స్ అందుకోవడంతో యూట్యూబ్ వారి ఛానెల్ కు డైమండ్ బటన్ ఇచ్చి సత్కరించింది.అంతేకాదు ఈ ఛానెల్ నెలకు 22 లక్షల నుండి 3 కోట్ల వరకు ఆదాయం అందుకుతున్నట్టు టాక్.చూసారుగా ఒక ప్రాంతీయ ఛానెల్ అయ్యుండి ఈ రికార్డ్ క్రియేట్ చేయడం నిజంగా అభినందించాల్సిన విషయమే.
తాజా వార్తలు