తెలుగులో ప్రముఖ దర్శకుడు కే.రుషేంద్ర రెడ్డి దర్శకత్వం వహించి “తొలి ముద్దు” అనే చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న తమిళ హీరో ప్రశాంత్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
అయితే అప్పట్లోనే హీరో ప్రశాంత్ తన చిత్రాలను తమిళంతో పాటూ తెలుగులో కూడా విడుదల చేసి మంచి మార్కెట్ ని సంపాదించుకున్నాడు. అయితే ఒకానొక సమయంలో తన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతుండడంతో కొంతకాలం పాటు సినిమాలకు విరామం ఇచ్చాడు.
ఈ క్రమంలో సినిమా పరిశ్రమకు చెందిన ఓ మహిళను పెళ్లి చేసుకున్నాడు. అయితే పెళ్లయిన కొంత కాలానికే వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో ఈ పెళ్లి కూడా పెటాకులైంది.
దీంతో పరస్పర అంగీకారంతో ఇద్దరు విడాకులు తీసుకున్నారు.కాగా ప్రస్తుతం హీరో ప్రశాంత్ తన కుటుంబ సభ్యులతో కలిసి తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై లో ఉంటున్నట్లు సమాచారం.
అయితే హీరో ప్రశాంత్ కి 47 ఏళ్ళు పైబడినప్పటికీ ఇప్పటికీ చాలా యంగ్ మరియు ఎనర్జీ గా కనిపిస్తూ మళ్ళీ హీరోగా సినిమాల్లో నటించడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే ఆ మధ్య కాలంలో టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన “వినయ విధేయ రామ” అనే చిత్రం ద్వారా మళ్లీ తెలుగు లో చాలా కాలం గ్యాప్ తర్వాత హీరో అన్నయ్య పాత్రలో నటించాడు.
అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయినప్పటికీ హీరో ప్రశాంత్ పాత్రకు మాత్రం సినీ విమర్శకుల నుంచి మంచి మార్కులే పడ్డాయి.
అయితే తెలుగులో హీరో ప్రసాద్ హీరోగా నటించినటువంటి జీన్స్, తొలి ముద్దు, జోడి మరియు మరిన్ని తెలుగు రీమేక్ చిత్రాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోవడమే కాకుండా ప్రశాంత్ కి మంచి గుర్తింపు తెచ్చాయి.
అయితే ప్రస్తుతం హీరో ప్రశాంత్ బాలీవుడ్లో మంచి విజయం సాధించిన అంధాదున్ చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం. అంతేగాక ఈ చిత్రానికి సంబంధించిన దర్శకత్వ పనులను ఇప్పటికే ఓ ప్రముఖ యంగ్ డైరెక్టర్ కి అప్పగించినట్లు తమిళ సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.