కరోనా దెబ్బకి మొత్తం పరిస్థితులు అన్ని మారిపోయాయి.మూడు నెలల లాక్ డౌన్ అన్ని రంగాలని పూర్తిగా కుదేలు చేసేసింది.
లాక్ డౌన్ నుంచి సడలింపులు ఇచ్చిన కూడా కరోనా కేసులు పెరుగుతూ ఉండటంతో ఇప్పటికే ఏ రంగం కూడా పూర్తిగా కోలుకోలేదు.ప్రధానంగా నిర్మాణ రంగం, రియల్ ఎస్టేట్, సినిమా, సాఫ్ట్ వేర్ రంగాలలో కరోనా తీవ్ర ప్రభావం చూపించింది.
ఈ రంగాలలో డబ్బు ఎప్పుడూ కూడా చేతులు మారుతూ ఉండాలి.కాని ఇప్పుడున్న పరిస్థితిలో ఎక్కడా కూడా అలాంటి సిచువేషన్ లేదు.
ముఖ్యంగా సినిమా రంగం అయితే మరింత దారుణంగా కుదేలైపోయింది.ఏదో ఓటీటీ చానల్స్ అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఆల్ రెడీ తెరకెక్కిన సినిమాలు రిలీజ్ చేసుకోవడానికి మార్గం దొరికి కొంత ఊరట లభించింది.
అయితే ఇప్పటికే చాలా సినిమాలు ప్రొడక్షన్ దశలో ఆగిపోయాయి.లాక్ డౌన్ తో నష్టాల నుంచి బయటపడేందుకు తమిళ నిర్మాతలు కీలక నిర్ణయం తీసుకున్నారు.ప్రస్తుతం భారీ బడ్జెట్ సినిమాలకి దర్శకులు కోరింత బడ్జెట్ పెట్టలేని పరిస్థితి నెలకొని ఉన్న నేపధ్యంలో షూటింగ్ కి అయ్యే ఖర్చుని ఎలాగూ తగ్గించాలేమని భావించి మరో రెమ్యునరేషన్ విషయంలో కాస్ట్ కటింగ్ చేయాలని భావించారు.దీనిలో భాగంగా నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికాలలో 50% కోత విధిస్తూ నిర్ణయం తీసుకున్నారట.
ఈ నిర్ణయాన్ని త్వరలో అఫీషియల్ గా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తుంది.దీనిపై నటీనటులు ఎలా స్పందిస్తారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
మరోవైపు కోలీవుడ్ నిర్మాతలు తీసుకున్న నిర్ణయంతో టాలీవుడ్ నిర్మాతలు కూడా ఆలోచనలో పడినట్లు తెలుస్తుంది.