ప్రపంచం అంతట క్రిస్మస్ వేడుకలు మొదలు అయ్యాయి.ఈ నేపథ్యంలోనే తమిళనాడు లోని చెన్నైలో క్రిస్మస్ వేడుకలకు డిఎంకే చీఫ్ స్టాలిన్ హాజరు అయ్యారు.
స్టాలిన్ సమక్షంలో ఓ మతబోదకురాలు హిందూ మతంపై తీవ్ర ఆరోపణలు చేసింది.రెండు శతాబ్దాల కిందట మాత్రమే హిందూ మతం ఉంది.
ఇప్పుడు ఉన్నది హిందూ మతం కాదని మనం అందరం శైవులం మాత్రమే అన్నారు.మనకు ప్రత్యేకమైన మతం అంటూ ఏమి లేదని.
మనం కలిసి సృష్టించుకున్నదే హిందూ మతం అన్నది.ముఖ్యంగా మనం అందరం తమిళులం అన్నారు.
స్టాలిన్ సమక్షంలో ఆ మత బోదకురాలు హిందూ మతంపై ఆరోపణలు చెయ్యడంతో తమిళ బిజేపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హిందూ మతాన్ని తిడుతూ మాట్లాడుతుంటే స్టాలిన్ మౌనం వహించడం సరికాదు అన్నారు.
కేవలం క్రైస్తవుల ఓట్లకోసమే ఇలాంటి ఆరోపణలు చేయించాడు అన్నారు.స్టాలిన్ హిందూ వ్యతిరేకి అన్నారు.
తమిళుల ఇష్టదైవం మురుగన్ ను మనం ఎంతగా పూజిస్తాం అలాంటిది ఆయనను అవమానించడం బాదకరమైన విషయం అని తమిళ బిజేపి చీఫ్ ఎల్ మురుగన్ అన్నారు.డిఎంకే పార్టీ క్రైస్తవులకి డబ్బులు ఇచ్చి హిందువులపై ఇలాంటి ఆరోపణలు చేయిస్తుందని కేవలం క్రిస్టియన్ల వొట్ల కోసం ఇంత నీచానికి దిగజారిందని, డిఎంకే పార్టీ ని, స్టాలిన్ ను పైన ఉన్న ఆ దేవుడు తప్పక శిక్షిస్తాడని బిజేపి అధికార ప్రతినిది నారాయణ్ తిరుపతి అన్నారు.
ఈ విషయంపై దేశంలో ఉన్న అన్నీ హిందూ సంస్థలు స్టాలిన్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.