దేశంలో కరోనా కేసులు ఉన్న కొద్ది పెరిగిపోతున్న పరిస్థితి ప్రస్తుతం నెలకొంది.వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా గానీ ఊహించని విధంగా ఇండియాలో కేసులు పెరిగిపోవటంతో కేంద్రం .
వైరస్ ఎక్కువగా విజృంభిస్తున్న రాష్ట్రాలకు ఉన్నతస్థాయి కేంద్ర బృందాలను పంపటం స్టార్ట్ చేసింది.ఇలాంటి తరుణంలో తమిళనాడు రాష్ట్రంలో కూడా కరోనా వైరస్ ఊహించని విధంగా పెరుగుతూ ఉన్న నేపథ్యంలో.
స్కూల్ పరీక్షలు నిర్వహించడం పెద్ద సవాలుగా మారింది.
గత ఏడాది జూన్ విద్యాసంవత్సరం ప్రారంభ మైనప్పటికీ ఆన్లైన్ ద్వారా క్లాసులు నిర్వహిస్తూ వస్తున్నారు.అయితే ప్రస్తుతం వైరస్ ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో స్కూల్ విద్యార్థుల పరీక్షల విషయంలో తమిళనాడు సర్కారు సరికొత్త నిర్ణయం తీసుకుంది.మేటర్ లోకి వెళితే తొమ్మిది, పది, పదకొండు తరగతుల విద్యార్థులకు పరీక్షలు నిర్వహించకుండా ప్రమోట్ చేస్తున్నట్లు ప్రకటించింది.
దేశంలో రెండోసారి కరోనా కేసులు విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తమిళనాడు ప్రభుత్వం తెలిపింది.
.