తమిళ భాషలో ప్రముఖ దర్శకుడు రామ్ కుమార్ తెరకెక్కించిన రాటసన్ చిత్రంలో హీరోగా నటించి మంచి హిట్ అందుకున్న తమిళ ప్రముఖ హీరో విష్ణు విశాల్ గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే విష్ణు విశాల్ ఇటీవలే తెలుగులో ప్రముఖ హీరో రానా దగ్గుబాటి హీరోగా నటించిన అరణ్య చిత్రంలో కూడా ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించి ప్రేక్షకులను బాగానే అలరించాడు.
కాగా నటుడు విష్ణు విశాల్ ఇటీవలే తన ప్రియురాలు గుత్తా జ్వాలని పెళ్లి చేసుకోబోతున్నట్లు అధికారికంగా ప్రకటించి నిశ్చితార్థం కూడా చేసుకున్నాడు.
దీంతో తాజాగా ఈ విషయం గురించి నటుడు విష్ణు విశాల్ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా స్పందించాడు.
ఇందులో భాగంగా ఓ నెటిజన్ మీరు మళ్లీ ప్రేమ వివాహం చేసుకోబోతున్నారా అని ప్రశ్నించాడు.దీంతో విష్ణు విశాల్ ఈ విషయం గురించి స్పందిస్తూ తాను ప్రస్తుతం ప్రేమ వివాహం చేసుకోవడం లేదని ఒకరినొకరు క్షుణ్ణంగా అర్థం చేసుకున్న తరువాతే పెళ్లి చేసుకుంటున్నామని స్పష్టం చేశాడు.
అంతేకాకుండా గతంలో తన భార్య రజనీ నటరాజ్ ని కూడా ప్రేమించి పెళ్ళి చేసుకున్నానని కానీ ఆమె తన జీవితంలో చేదు జ్ఞాపకాలను మిగిల్చి విడాకులు ఇచ్చి వెళ్లిపోయిందని అందువల్లనే ఇకపై ప్రేమ పెళ్లి కాకుండా ఒకరినొకరు అర్థం చేసుకుని పెళ్లి చేసుకోవడమే మంచిదనుకున్నానని చెప్పుకొచ్చాడు.అంతేకాకుండా గుత్తా జ్వాల తనని చాలా బాగా అర్థం చేసుకుందని, ఆమెకు తన గత జీవితం గురించి పూర్తిగా తెలుసని అందువల్లనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం విష్ణు విశాల్ తమిళంలో ఎఫ్ఐఆర్ అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.ఈ చిత్రానికి తమిళ ప్రముఖ దర్శకుడు ఆనంద్ దర్శకత్వం వహిస్తుండగా విష్ణు విశాల్ సహనిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.కాగా ఈ చిత్రంలో ఉన్న ప్రముఖ బ్యూటిఫుల్ హీరోయిన్స్ మంజిమా మోహన్ మౌనిక, రెబ మౌనిక జాన్, అలాగే ప్రముఖ సీనియర్ దర్శకుడు గౌతమ్ మీనన్, తదితరులు ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు కూడా పూర్తయినట్లు సమాచారం.