తమిళ సూపర్ స్టార్ విజయ్ హీరోగా రూపొందుతున్న ‘బీస్ట్ ‘సినిమా విడుదలకు సిద్ధం అవుతోంది.నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఆ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ ముగింపు దశకు వచ్చిందని ఇటీవలే అధికారికంగా ప్రకటించారు.
ఇప్పుడు విజయ్ మరో సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన రాబోతుంది.విజయ్ హీరో గా తెలుగు లో ఒక సినిమా రూపొందబోతున్న విషయం తెల్సిందే.
ఆ సినిమా కు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది.దిల్ రాజు నిర్మాణంలో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందబోతుంది.
ప్రస్తుతం సినిమాకు సంబంధించిన చివరి దశ స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్నట్లుగా చెబుతున్నారు.నేడు సాయంత్రం 5 గంటలకు సినిమాకు సంబంధించిన కీలక విషయాన్ని చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
దిల్ రాజు కాంపౌండ్ నుండి ఈ లీక్ అందింది.తెలుగు మరియు తమిళ సినీ అభిమానులు మరియు ప్రేక్షకులు ఆ అప్ డేట్ కోసం ఎదురు చూస్తున్నారు.
పెద్ద ఎత్తున అంచనాలున్న ఈ సినిమా ను వచ్చే ఏడాది చిత్రీకరించి 2023 లో ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లుగా చెబుతున్నారు.బీస్ట్ సినిమాను వచ్చే ఏడాది ఆరంభంలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సాధించిన మాస్టర్ తర్వాత రాబోతున్న సినిమా అవ్వడంతో ‘బీస్ట్ ‘పై అంచనాలు భారీగా ఉన్నాయి.ఆ తర్వాత రాబోతున్న వంశీ సినిమా మరింతగా బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందని ప్రతి ఒక్కరు అంటున్నారు ‘బీస్ట్’ ను తెలుగు లో కూడా పెద్ద ఎత్తున విడుదల చేస్తారట. తెలుగు లో విజయ్ మొదటి సారి నటించబోతున్న నేపథ్యంలో దిల్ రాజు ఏకంగా 250 కోట్ల బడ్జెట్ ను కేటాయించాడనే వార్తలు వస్తున్నాయి.అసలు విషయాలు నేడు సాయంత్రం ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.