మలయాళం లో తోరకెక్కిన దృశ్యం సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.ఆ సినిమా ను తెలుగు లో వెంకటేష్ మరియు మీనా జోడీగా రీమేక్ చేశారు.
తెలుగు లో కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.ఇక తమిళంలో ఈ సినిమా ను కమల్ హాసన్ మరియు గౌతమి లు జంటగా పాపనాశం అనే టైటిల్ తో రీమేక్ చేశారు.
హిందీలో కూడా ఈ సినిమా ను అజయ్ దేవగన్ మరియు శ్రియ ల కాంబోలో రీమేక్ చేశారు.అన్ని భాషల్లో కూడా దృశ్యం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.
ఇప్పుడు దృశ్యం 2 సినిమా ట్రెండ్ నడుస్తోంది.మలయాళం లో ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది.
తెలుగు లో మళ్లీ వెంకటేష్ మరియు మీనా లు జోడీగా రీమేక్ రూపొందింది.ప్రస్తుతం తమిళ దృశ్యం 2 గురించిన చర్చ జరుగుతోంది.
ఎందుకంటే కమల్ సిద్దంగా ఉన్నా కూడా గతంలో ఆయనకు జోడీగా నటించిన గౌతమి మాత్రం ఇప్పుడు ఆయన తో నటించేందుకు సిద్దంగా లేదు.
గౌతమి మరియు కమల్ లు బ్రేకప్ అవ్వడం వల్ల దృశ్యం 2 తమిళ వర్షన్ పై ప్రభావం పడింది.
గౌతమి కాకుండా మరెవ్వరు అయినా కూడా ఓకే అన్నట్లుగా కమల్ ప్రకటించడంతో దర్శకుడు మొదట మీనాను అనుకున్నాడు.

కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం దృశ్యం 2 తమిళ వర్షన్ లో కమల్ కు జోడీగా నదియా ను నటింపజేయబోతున్నారట.తెలుగు వర్షన్ దృశ్యం లో ఆమె పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నారు.ఆమె ను ఇప్పుడు తమిళ దృశ్యం 2 హీరోయిన్ గా మార్చడం మంచి నిర్ణయం అంటున్నారు.
ప్రేక్షకులు కొత్తదనం ఫీల్ అవ్వరు.

ఎందుకంటే దృశ్యం లో ఆమె ఉంటుంది.కాని హీరోయిన్ గా కాదు.కనుక ఖచ్చితంగా పాపనాశనం కు నదియ మరియు కమల్ ల జోడీ ఖచ్చితంగా పాజిటివ్ అవుతుందని ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవల దర్శకుడు జీతూ జోసెఫ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను తమిళంలో దృశ్యం 2 ను రీమేక్ చేస్తానంటూ చెప్పడంతో పాటు నదియా నటించబోతున్నట్లుగా ఆయన ప్రకటించాడు.