టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం వరుస ఆఫర్లతో బిజీగా దూసుకుపోతున్నారు.ఇక ఈయన నటన తో మంచి గుర్తింపు పొందుకొని ఎంతోమంది అభిమానుల హృదయాలను గెలుచుకున్నారు.
అల్లుఅర్జున్ సోషల్ మీడియాలో కూడా ఎప్పటికప్పుడు ఫోటోల షేర్ల తో బిజీగా ఉంటాడు.అంతేకాకుండా ఆయన పిల్లలతో చేసే అల్లర్లను కూడా సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటారు.
ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న పుష్ప సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఇందులో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తుంది.ఇక ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ లో బిజీగా ఉండగా.ఈ ఏడాది విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
ఇదిలా ఉంటే కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమాలో చేయనున్నాడు.
#AA21 గా తెరకెక్కనున్న సినిమాలో ప్రథమార్థంలో స్టూడెంట్ లీడర్ గా, ద్వితీయార్థంలో రాజకీయ నాయకుడిగా చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.త్వరలోనే ఈ సినిమా సెట్ లోకి వెళ్ళనున్నట్లు సమాచారం.ఇదిలా ఉంటే ఈ సినిమాలో మరొక వార్త సోషల్ మీడియాలో బాగా వినిపిస్తుంది.
ఇందులో స్టార్ కూతురు నటించనున్నట్లు వార్తలు ప్రముఖ నటుడు శరత్ కుమార్ కూతురు నటి వరలక్ష్మి ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించనుందట.ఇదివరకే క్రాక్ సినిమాలో వరలక్ష్మి జయమ్మ పాత్రలో నటించగా.
ఈ పాత్ర తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.అంతేకాకుండా అల్లరి నరేష్ నటించిన నాంది సినిమాలో ఆద్యగా బాగా మెప్పించింది.
ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ సినిమాలో వరలక్ష్మి రాజకీయ నాయకురాలి పాత్రలో నటించనున్నట్లు తెలుస్తుంది.ఇక ఈ సినిమా గురించి త్వరలోనే సినీ బృందం మరిన్ని ప్రకటనలు చేయనున్నారు.
ఇక డైరెక్టర్ భాస్కర్ తో అల్లు అర్జున్ మరో సినిమా చేయనున్నాడట.మొత్తానికి అల్లు అర్జున్ వరుస ఆఫర్లతో బిజీగా ఉన్నాడు.