ఒక్కోసారి కొంతమంది హీరో, హీరోయిన్లు తమ సొంత భాషలో సినీ కెరీర్ మొదలుపెట్టి అనుకోకుండా అవకాశాలను కోల్పోయి ఇతర భాషా సినీ పరిశ్రమలకు వెళ్ళిపోయి అక్కడ బాగానే రాణిస్తూ సెటిల్ అయిన నటీనటులు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు.కాగా ఇటీవలే టాలీవుడ్ ప్రముఖ హీరో శ్రీ విష్ణు మరియు యంగ్ డైరెక్టర్ “హర్షిత్ గోలి” కాంబినేషన్ లో తెరకెక్కిన “రాజరాజ చోర” చిత్రంలో హీరో భార్య పాత్రలో నటించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న యంగ్ హీరోయిన్ సునైనా ఈ కోవకే చెందుతుంది.
కాగా మొదటగా సునైనా తన సినీ కెరీర్ ని టాలీవుడ్ సినిమా ద్వారా 2005వ సంవత్సరంలో మొదలు పెట్టింది.కానీ ఈ అమ్మడు నటించిన మొదటి చిత్రం “కుమార్ వర్సెస్ కుమారి” కనీసం మొదలైనట్లు కూడా ప్రేక్షకులకి తెలియదు.
దీంతో గుర్తింపుకు నోచుకోలేకపోయింది.అయినప్పటికీ పట్టు విడవకుండా సినిమా అవకాశాల కోసం ప్రయత్నించింది.
ఈ క్రమంలో “10థ్ క్లాస్” చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా నటించే అవకాశం దక్కించుకుంది.అయితే ఈ చిత్రం హిట్ అవడంతో సునైనా కి బాగానే కలిసొచ్చింది.
దీంతో ఈ అమ్మడు సినీ కెరియర్ కూడా ఒక్కసారిగా మలుపు తిరిగింది.
కానీ దురదృష్టవశాత్తు ఈ అమ్మడు తెలుగులో నటించిన చిత్రాలు పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి.దీంతో అవకాశాలు ఉన్నప్పటికీ సరైన గుర్తింపు లేకపోవడంతో తమిళ్ సినిమా పరిశ్రమ కి వెళ్ళిపోయింది.అయితే అక్కడ మాత్రం వరుసగా సినిమా అవకాశాలు దక్కించుకుంటూ బాగానే ప్రేక్షకులను అలరించింది.
దీంతో ఈ అమ్మడు అనతి కాలంలోనే హీరోయిన్ గా మంచి గుర్తింపు లభించింది.దాంతో సునైనా టాలీవుడ్ సినిమా పరిశ్రమని దాదాపుగా పక్కన పెట్టింది.
కాగా ఆ మధ్య “పెళ్ళికి ముందు ప్రేమ కథ” అనే చిత్రంతో 2017వ సంవత్సరంలో టాలీవుడ్ సినీ ప్రేక్షకులను పలకరించినప్పటికీ ఈ చిత్రం కూడా పెద్దగా అలరించలేక పోయింది.దాంతో తెలుగులో సినీ కెరీర్ మొదలు పెట్టిన సునైనా ప్రస్తుతం తమిళ్, కన్నడ, తదితర భాషలలో హీరోయిన్ గా అవకాశాలు దక్కించుకుంటూ బాగానే రాణిస్తోంది.
అయితే టాలీవుడ్ లో సినీ కెరీర్ ని మొదలు పెట్టి ఇతర పరిశ్రమలకు వెళ్లి సెటిల్ అయిన నటీనటులలో తెలుగమ్మాయి అంజలి, స్వర్గీయ నటి శ్రీదేవి, శ్రీ దివ్య, షెర్లిన్ చోప్రా, తదితరులు బాగానే సినీ కెరీర్లో విజయం సాధించారు.అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం తమిళంలో ఓ ప్రముఖ దర్శకుడు తెరకెక్కించిన ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించే అవకాశం దక్కించుకున్నట్లు సమాచారం.