స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమాలో చేస్తున్నాడు.ఈ సినిమా లాక్ డౌన్ కి ముందే ప్రకటించిన కరోనా పరిస్థితుల కారణంగా షూటింగ్ వాయిదా పడింది.
మరల ప్రస్తుతం షూటింగ్ లకి అనుమతి ఇవ్వడంతో చిత్ర యూనిట్ షెడ్యూల్ ప్లాన్ చేస్తుంది.కేరళ ఫారెస్ట్ లో ఈ సినిమా షూటింగ్ చేయాలని అనుకుంటున్నారు.
అంతకంటే ముందుగా సాంగ్ తో ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు.ఇదిలా ఉంటే ఈ సినిమా ఇంకా సెట్స్ పైకి వెళ్లకుండానే రకరకాల వార్తలు వినిపిస్తునానయి.
సాయి పల్లవి ఈ సినిమాలో అల్లు అర్జున్ చెల్లిగా కనిపించబోతుంది అనే టాక్ బాగా ట్రెండ్ అవుతుంది.అయితే ఈ వార్తలలో ఎంత వరకు నిజం ఉందో తెలియదు.
ఇక నవంబర్ 20 నుంచి షూటింగ్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు.హైదరాబాద్ లో ఓ ప్రయివేట్ ప్లేస్ లో వేసిన సెట్ లో హీరో, హీరోయిన్స్ మధ్య డ్యూయెట్ షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారు.
ఇదిలా ఉంటే ఈ సినిమాలో విలన్ గా ముందుగా విజయ్ సేతుపతిని అనుకున్నారు.అయితే ఆయనకీ డేట్స్ కుదరకపోవడంతో సినిమా నుంచి తప్పుకున్నారు.అయితే ఇక విలన్ పాత్రల కోసం చాలా మంది పేర్లు వినిపించాయి.తెలుగు హీరోలని కూడా పరిశీలించారు.
ఇందులో విలన్ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉండటంతో అంతే మాసివ్ గా హీరోతో సమానంగా ఉంటుంది.ఈ కారణంగా సినిమా కోసం హీరోలనే తీసుకోవాలని అనుకున్నారు.
అయితే ఫైనల్ గా ఈ పాత్ర కోసం ఒకప్పటి తమిళ స్టార్ హీరో మాధవన్ ని విలన్ గా ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది.ఇప్పటికే మాధవన్ తెలుగులో సవ్యసాచి సినిమాలో విలన్ గా నటించి మెప్పించాడు.
అయితే ఆ సినిమా అనుకున్న స్థాయిలో సక్సెస్ కాకపోవడం మాధవన్ పాత్ర జనాల్లోకి వెళ్ళలేదు.అయితే ఈ సినిమాలో మాత్రం మాధవన్ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని సమాచారం.
త్వరలో దీని గురించి చిత్ర యూనిట్ అఫీషియల్ గా కన్ఫర్మ్ చేస్తుందని సమాచారం.