దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది.ఈ మహమ్మారి కారణంగా వేల మంది ప్రాణాలు కోల్పోయారు.
కొన్ని లక్షల మంది ప్రజలు ఈ వైరస్ బారిన పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.ఇక సామాన్య ప్రజల నుండి ప్రజాప్రతినిధులు, సెలెబ్రెటీల వరకు ఎవరిని వదిలిపెట్టడం లేదు.
ఇక ఈ మహమ్మారి కారణంగా చాల మంది నాయకులు, సెలెబ్రెటీలు ప్రాణాలు కోల్పోయారు.ఇక హాలీవుడ్, బాలీవుడ్ లో కొందరు సెలబ్రిటీలు కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.
తాజాగా ప్రముఖ తమిళ నటుడు కరోనా బారినపడి మృతి చెందారు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.
ప్రముఖ తమిళ నటుడు ఫ్లోరెంట్ పెరిరా గతకొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతుండగా ఆసుపత్రికి వెళ్లారు.వైద్యులు ఆయనకు కరోనా పరీక్షలు నిర్వహించారు.
నిర్దారణ పరీక్షల్లో అతనికి కరోనా పాజిటివ్ వచ్చినట్లుగా తెలిపారు.ఆయన కరోనా చికిత్స తీసుకుంటుండంగా మంగళవారం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు.
ఫ్లోరెంట్ పెరిరా తమిళ , మలయాళ సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు.ఈయనకు రాజా మంతిరి, ధర్మదురై, తోడరి, సత్రియాన్, ముప్పారిమనమ్, వంటి చిత్రాల్లో ఆయన నటించారు.
ఇక ఇటీవల కాలంలో ఆయన బీజేపీలో చేరారు. ఫ్లోరెంట్ పెరిరా మృతికి తమిళనాడుకు చెందిన సినీనటులుతో పాటు రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.