గోపీచంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో సిటీ మార్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాలో తమన్నా గోపీచంద్ కి జోడీగా నటిస్తుంది.
కబడ్డీ నేపధ్యంలో ఈ సినిమా కథ ఉండబోతుంది.ఇప్పటికే ఈ సినిమా మెజారిటీ షూటింగ్ కంప్లీట్ అయిపొయింది.
లాక్ డౌన్ కరోనా కారణంగా చివరి షెడ్యూల్ షూటింగ్ వాయిదా పడింది.అయితే సినిమా షూటింగ్ లకి అనుమతి ఇవ్వడంతో తిరిగి షూటింగ్ ప్రారంభించాలని దర్శకుడు సంపత్ నంది భావిస్తున్నాడు.
త్వరలో సెట్స్ పైకి వెళ్లి వీలైనంత వేగంగా షూటింగ్ ముగించుకోవాలని, కీలకమైన కబడ్డీ గేమ్ ఎపిసోడ్ మాత్రమే ఉండటంతో దానిని పూర్తి చేయాలని షెడ్యూల్ ప్లాన్ చేసుకుంటున్నాడు.
అయితే హీరో గోపీచంద్ మాత్రం షూటింగ్ లో పాల్గొనడానికి సిద్ధంగా లేలని, ఇప్పట్లో తనని పిలవొద్దని చిత్ర యూనిట్ కి స్పష్టంగా చెప్పెసినట్లు తెలుస్తుంది.
ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో షూటింగ్ లో పాల్గొనే రిస్క్ చేయలేనని ఇంట్లో పిల్లలు కూడా ఉండటం కుటుంబం సేఫ్టీ తనకి మొదటి ప్రాధాన్యత అని దర్శకుడు సంపత్ నందికి క్లారిటీగా చెప్పేయడం జరిగిందని సమాచారం.తమన్నా షూటింగ్ లో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నా కూడా గోపీచంద్ సిద్ధంగా లేకపోవడంతో ఏమీ చేయాలని పరిస్థితిలో షూటింగ్ వాయిదా వేసుకోవడానికి దర్శకుడు ప్రాధాన్యత ఇచ్చాడని తెలుస్తుంది.
కరోనా పరిస్థుతులు పూర్తిగా సాధారణ స్థితికి వచ్చే వరకు షూటింగ్ జరిగే అవకాశాలు లేవని దీనిని బట్టి అర్ధమవుతుంది.