టాలీవుడ్ మిల్క్ బ్యూటీ తమన్నా గురించి అందరికి తెలిసిందే.తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ గ్లామర్ బ్యూటీ అతి తక్కువ సమయంలో స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా నిలిచింది.
తెలుగుతో పాటు హిందీ, తమిళం భాషలలో కూడా నటించింది.ప్రస్తుతం వరుస సినిమాలలో బాగా బిజీగా ఉంది.
ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.
2005లో శ్రీ అనే సినిమాతో తొలిసారిగా ఇండస్ట్రీకి పరిచయమైన తమన్నా ఈ సినిమాతో అంతగా గుర్తింపు తెచ్చుకోలేదు.ఆ తర్వాత హ్యాపీ డేస్ సినిమాలో నటించి వెనుతిరిగి చూడకుండా వరుస సినిమాలలో నటించి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా నిలిచింది.అంతేకాకుండా పలు సినిమాలలో స్పెషల్ సాంగ్ లలో కూడా మెప్పించింది ఈ బ్యూటీ.
పాన్ ఇండియా బాహుబలి సినిమాతో మంచి గుర్తింపు అందుకుంది.
ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో ఈ మధ్య మరింత యాక్టివ్ గా మారింది.
గతంలో కోవిడ్ జాగ్రత్తలు తెలుపగా ప్రస్తుతం పలు వీడియోలను, ఫోటోలను బాగా షేర్ చేసుకుంటుంది.అంతే కాకుండా తన అభిమానులతో ముచ్చటిస్తుంది.
ఇక తాజాగా తన సోషల్ మీడియా వేదికగా ఓ ఫోటో షేర్ చేయగా అందులో మంగళవారం సినిమా లొకేషన్ లో ఉన్నట్లు కనిపించింది.అందులో ఓ చేతిలో కాఫీ మరో చేతిలో కేక్ పట్టుకొని ఫోటోకి ఫోజ్ ఇచ్చింది.
అంతేకాకుండా షూటింగ్ కు ముందు అల్పాహారం కోసం కేక్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది.ఈ ఫోటో నెట్టింట్లో వైరల్ గా మారగా అభిమానులు తెగ లైక్స్ చేస్తున్నారు.
ఇక ప్రస్తుతం ఈ బ్యూటీ గోపీచంద్ తో కలిసి సీటీమార్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఇక ఎఫ్3, గుర్తుందా శీతాకాలం, అంధాధున్, బోలె చుడియన్ వంటి వరుస సినిమాలతో బిజీగా ఉంది.ఇదిలా ఉంటే ఓ వెబ్ సిరీస్ లో కూడా నటిస్తుంది.అంతేకాకుండా ఇటీవలే కన్నడ డైరెక్టర్ నార్తన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో అవకాశం వచ్చినట్లు తెలుస్తుంది.