ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా నెలకొన్న లాక్డౌన్ వల్ల అందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు.ఈ క్రమంలో పలువురు సెలెబ్రిటీలు వివిధ ఛాలెంజ్లతో సోషల్ మీడియాలో దుమ్ములేపుతున్నారు.
ఇప్పటికే స్టార్ హీరోలందరూ ‘బీ ది రియల్ మాన్’ అంటూ ఇంటిపనులు చేసే ఛాలెంజ్ను ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారుతోంది.
కాగా ఇప్పుడు హీరోయిన్లు కూడా ఓ ఛాలెంజ్తో సోషల్ మీడియాలో దుమ్ములేపుతున్నారు.
ఇటీవల ఆర్ఎక్స్100 చిత్రం హీరోయిన్ పాయల్ రాజ్పుత్ పిల్లో ఛాలెంజ్తో సోషల్ మీడియాలో ఎలాంటి మంటలు పుట్టించిందో అందరికీ తెలిసిందే.ఒంటిపై నూలుపోగు లేకుండా కేవలం దిండుతోనే శరీరాన్ని దాచుకునే ఛాలెంజ్తో పాయల్ పాప అదరగొట్టింది.
దీంతో ఇప్పుడు ఈ ఛాలెంజ్ను మిల్కీ బ్యూటీ తమన్నా కూడా యాక్సెప్ట్ చేసింది.తనదైన శైలిలో దిండును శరీరానికి అడ్డుగా పెట్టి అమ్మడు ఇచ్చిన పోజు నెటిజన్లకు చుక్కలు చూపిస్తోంది.
అందాల ఆరబోతను ఇలా కూడా చేయొచ్చా అనే విధంగా తమన్నా పిల్లో ఛాలెంజ్తో తెలిపింది.ఇక సినిమాల పరంగా తమన్నా సీటీమార్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.