బాలీవుడ్ లో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత వారసత్వం, బంధుప్రీతి గురించి ఎక్కువ చర్చ నడుస్తుంది.సెలబ్రిటీలు ఎక్కడ కనిపించిన మీడియా వాళ్ళు, లేదంటే సోషల్ మీడియాలో ఫ్యాన్స్ వారిని నెపోటిజం గురించి గుచ్చి గుచ్చి ప్రశ్నిస్తున్నారు.
అయితే ఈ విషయంలో కొంత మంది వారసత్వం అసలు తప్పు కాదని సమర్ధిస్తూ ఉంటే, కొంత మంది మాత్రం ఈ వారసత్వం, బంధుప్రీతి కారణంగానే తమకి అనుకున్న స్థాయిలో అవకాశాలు రాలేదని, తమ అవకాశాలు వారు లాగేసుకున్నారు అంటూ విమర్శిస్తున్నారు.అయితే ఈ చర్చ ఎక్కువగా బాలీవుడ్ లో నడుస్తూ ఉండగా సౌత్ లో కూడా వారసత్వ నటులు ఎక్కువగా ఉండటంతో ఎక్కడ కూడా దానిని తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం కొందరు చేస్తున్నారు.
తాజాగా వారసత్వంపై టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా కూడా స్పందించింది.మీడియా అడిగిన వాటికి సమాధానంగా వారసత్వంపై తన అభిప్రాయాలు చెప్పుకుంది.వారసత్వం అసలు తప్పు కాదని, బంధుప్రీతి అనేది అన్ని రంగాలలో కూడా ఉంటుందని తెలిపింది.అయితే ఎంత వారసత్వం నుంచి వచ్చినా కూడా ప్రతిభ, సామర్ధ్యం లేకపోతే ఏ రంగంలో అయిన ఎదగడం కష్టం అని స్పష్టం చేసింది.
తను సినీ రంగానికి ఏ మాత్రం సంబంధం లేని కుటుంబం నుంచి వచ్చాను.అయిన కూడా సౌత్ ఇండియా సినిమాలలో తనకి అవకాశాలు పుష్కలంగా వచ్చాయి.
ఇక్కడి ప్రేక్షకులు, అలాగే దర్శక, నిర్మాతలు కూడా తనకి అవకాశాలు ఇచ్చారు.స్టార్ హీరోయిన్ ని చేశారు.
బాలీవుడ్ లో కూడా నాకు భాగానే అవకాశాలు లభించాయి.సామర్ధ్యం ఉంది కాబట్టే నాకు గుర్తింపు లభించింది అని తమన్నా నెపోటిజం గురించి తన అభిప్రాయం తెలియజేసింది.