ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు కరోనాతో భయపడుతున్నారు.ఓ విధంగా చెప్పాలంటే ప్రపంచం అంతా ప్రస్తుతం కరోనాతో సహవాసం చేస్తుంది అని చెప్పాలి.
లక్షల సంఖ్యలో ప్రజల్లో కరోనా బారిన పడ్డారు.అందులో ఎక్కువ మంది కోలుకుంటే కొంత మంది ప్రాణాలు కోల్పోయారు.
చాలా మంది ప్రముఖులు సైతం కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు.సెలబ్రెటీలు, ప్రముఖులలో చాలా మంది కరోనా బారిన పడ్డారు.
వారిలో కొంత మంది కోలుకొని మరల తమ జీవితం స్టార్ట్ చేశారు.తాజాగా సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా కూడా కరోనా బారిన పడింది.
అయితే ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకపోవడంతో వేగంగానే కోలుకొని హాస్పిటల్ నుంచి బయటకి వచ్చింది.ఈ నేపధ్యంలో కరోనాతో తాను ఫిట్ నెస్ పరంగా ఎంతగా వీక్ అయిపోయానో అనే విషయాన్ని తన ఇన్స్టాగ్రామ్ స్టోరీ ద్వారా చెప్పుకొచ్చింది.
ముఖ్యంగా కరోనా నుంచి కోలుకున్న తర్వాత ఫిట్ నెస్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.మరల ఎలా రికవరీ అవ్వాలి అనే విషయాలని తమన్నా తన వీడియో ద్వారా చెప్పుకొచ్చింది.
కరోనా నుంచి కోలుకున్న తర్వాత ఫిట్నెస్ సంతరించుకోవడం చాలా ముఖ్యమని, వ్యాయామం చేయాలని తెలిపింది.అయితే వర్కవుట్లు హడావుడిగా కాకుండా శరీరం చెప్పేది వింటూ జాగ్రత్తగా చేయాలని సూచించారు.
ఈ వీడియోలో తమన్నాను చూస్తే కరోనాకు ముందు తర్వాత తన ఫిట్నెస్ విషయంలో ఎలాంటి కేరింగ్ తీసుకుంటుంది అనే విషయం స్పష్టంగా తెలుస్తుంది.కరోనాకి ముందు ఫిట్ నెస్ పరంగా ఎక్కువ వర్క్ ఔట్స్ చేసేదానిని అని అయితే ఇప్పుడు శరీరం సహకరించకపోవడం వలన కాస్తా కేర్ ఫుల్ గా చేస్తున్నానని శారీరక సామర్ధ్యం ఎంత వర్కౌ ఉందో అంతే చేస్తున్నట్లు చెప్పుకొచ్చింది.
.