టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు జక్కన్న ఎస్ ఎస్ రాజమౌళి ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.అయితే ఈ చిత్రం అప్పట్లో స్వాతంత్రం కోసం పోరాడిన అమరవీరులయినటువంటి అల్లూరి సీతారామరాజు మరియు కొమరం భీమ్ జీవిత గాథ ఆధారంగా తెరకెక్కుతోంది.
అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించి నటువంటి ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
అయితే ఇంతకీ ఆ వార్త ఏంటంటే ఈ చిత్రంలో జీరో సైజ్ నడుముతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో కట్టిపడేసినటువంటి టాలీవుడ్ బ్యూటీ క్వీన్ మరియు ముంబై మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా స్పెషల్ సాంగ్ లో చిందులేయనున్నట్లు సోషల్ మీడియా మాధ్యమాల్లో పలు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.
అంతేగాక ఈ చిత్రానికి సంబంధించిన పాటలలో తమన్నానటించిన టువంటి స్పెషల్ సాంగ్ హైలెట్ గా నిలుస్తుందని, అలాగే ఈ పాటకి సంబంధించినటువంటి చిత్రీకరణ పనులు కూడా ఇప్పటికే మొదలైనట్లు పలు టాలీవుడ్ సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.కానీ ఈ విషయంపై దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళిగానీ మరియు మరే ఇతర చిత్ర యూనిట్ సభ్యులు కూడా స్పందించడం లేదు.దీంతో ఈ చిత్రంలో తమన్నా స్పెషల్ సాంగ్ లో నటిస్తుందో లేదో ఇంకా తెలియాల్సి ఉంది.
ఈ విషయం ఇలా ఉండగా ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి దాదాపుగా చిత్రీకరణ పనులు పూర్తయ్యాయి.
అయితే గతంలో ఈ చిత్రాన్ని చిత్ర యూనిట్ సభ్యులు మే నెలలో విడుదల చేయాలని అనుకున్నప్పటికీ పలు సాంకేతిక పనుల కారణంగా ఈ చిత్రం అన్ని వచ్చే ఏడాది జనవరి నెలలో విడుదల చేస్తున్నట్లు ఇటీవలే ఈ చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటన చేశారు.
అయితే ప్రస్తుతం ఉన్నటువంటి కరోనా వైరస్ కారణంగా గా లాక్ డౌన్ విధించడంతో షూటింగులను వాయిదా వేయడంతో ఈసారైనా అనుకున్న సమయానికి ఈ చిత్రాన్ని విడుదల చేస్తారా లేదా అని ఇటు నందమూరి అభిమానులు, అటు మెగా అభిమానులు సందిగ్ధంలో ఉన్నారు.