బిగ్బాస్ సీజన్ 3 రెండు వారాల పాటు సాఫీగా సాగింది.కాని ఈ వారం మాత్రం ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతోంది.
ప్రేక్షకుల చిరాకుకు ప్రధాన కారణం తమన్నా సింహాద్రీ.తనను ఎలిమినేషన్కు నామినేషన్ చేసిన రవి కృష్ణపై మాటలతో ప్రతీకారం తీర్చుకుంటుంది.
సిగ్గుందా అంటూ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ అతడి ఓపికకు సహనం పెట్టింది.పప్పు అంటూ అతడి ముందు చేసిన వ్యాఖ్యలతో అంతా కూడా షాక్ అవుతున్నారు.
ఇక పప్పు అంటూ తమన్నా చేస్తున్న ఓవర్ యాక్షన్ను ప్రేక్షకులు కూడా తట్టుకోలేక పోతున్నారు.
ఈ వారం తమన్నా ఖచ్చితంగా ఎలిమినేట్ అవుతుంది.అందులో ఒక్క శాతం కూడా అనుమానం లేదు.అందుకే ఈ నాలుగు రోజులు నీకు నేనేంటో చూపిస్తాను అంటూ రవిని టార్గెట్ చేసిన తీరు ఆమెపై ప్రేక్షకులకు అసహ్యంను కలిగిస్తుంది.
అసలు అతడిని అంతగా టార్గెట్ చేయడం ఎంటీ అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.ఇది ఏమాత్రం సరి కాదు.నాగార్జున గారు దయచేసి తమన్నాను ఆదివారం వరకు కాకుండా ముందే పంపించండి అంటూ ఫ్యాన్స్ మరియు ప్రేక్షకులు రిక్వెస్ట్ చేస్తున్నారు.
తమన్నా ఓవర్ యాక్షన్ చూడలేక చస్తున్న సమయంలో బిగ్బాస్ టాస్క్ ఇవ్వడంతో కాస్త కూల్ అయ్యింది.ప్రస్తుతం అంతా కూడా బిగ్బాస్ ఇచ్చిన కెప్టెన్సీ టాస్క్లో బిజీగా పాల్గొంటున్నారు.తమన్నా ఈ నాలుగు రోజులు మరెంత పెంట చేస్తుందో అంటూ అంతా కూడా అనుకుంటున్నారు.
బిగ్బాస్ సీజన్ 3లో ట్రాన్స్ జెండర్ అనగానే అంతా కూడా ఒకింత ఆసక్తిని వ్యక్తం చేశారు.కాని తమన్నా ప్రేక్షకుల ఆసక్తిని నీరుగార్చడంతో పాటు, బాబోయ్ ఎందుకు వచ్చావు అన్నట్లుగా అయ్యింది పరిస్థితి.