ఇండస్ట్రీకి చెందిన నటీనటులు కొన్ని కొన్ని సార్లు తమ సినిమాల విషయంలో దర్శక నిర్మాతలకే చుక్కలు చూపిస్తూ ఉంటారు.వాళ్లకు ఇండస్ట్రీలో ఒక హోదా వచ్చేసరికి వాళ్ళల్లో ఎన్నో మార్పులు కనిపిస్తుంటాయి.
పైగా కొన్ని కొన్ని సార్లు డిమాండ్లు కూడా చేస్తుంటారు.అలా ఇప్పటికి ఎంతో మంది నటీనటులు ఇండస్ట్రీలో బాగా డిమాండ్ చేసి గౌరవాన్ని కూడా కోల్పోయారు.
ఇదిలా ఉంటే తమన్నా కూడా ఏకంగా నిర్మాతకే చుక్కలు చూపించింది.కానీ ఈ అమ్మడి క్రేజ్ మాత్రం అస్సలు తగ్గలేదు.
ఇంతకీ అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం.
తమన్నా తెలుగు సినీ ఇండస్ట్రీకి 2005లో శ్రీ అనే సినిమాతో పరిచయమైంది.
ఇక ఈ సినిమా తర్వాత హ్యాపీడేస్ సినిమాలో నటించి మంచి పేరు సంపాదించుకుంది.దీంతో వరుసగా ఎన్నో సినిమాలలో అవకాశాలు అందుకుని ఓ రేంజ్ లో దూసుకెళ్లింది.
చాలావరకు స్టార్ హీరోల సినిమాలలో నటించి స్టార్ హోదా ను సంపాదించుకుంది.కొన్ని సినిమాలలో స్పెషల్ సాంగ్ లలో కూడా మెప్పించింది.
తెలుగులోనే కాకుండా హిందీ, తమిళ, కన్నడ భాషలలో కూడా నటించింది.
తమిళ ఇండస్ట్రీలో కూడా స్టార్ హీరోయిన్ గా నిలిచింది.తన గ్లామర్ తో ఎంతోమంది కుర్రాళ్ళ హృదయాలను దోచుకుంది.పైగా విపరీతమైన అభిమానుల సంఖ్య కూడా పెంచుకుంది.
ఇక ప్రస్తుతం వరుస సినిమాలలో బాగా బిజీగా ఉంది.ఇక తమన్నా ఇప్పటివరకు ఎటువంటి విమర్శలు ఎదుర్కోలేదు.
అంతేకాకుండా తాను కూడా ఇండస్ట్రీలో ఎవరితో అమర్యాదగా ప్రవర్తించలేదు.
కానీ గతంలో ఓ బడా నిర్మాతకు చుక్కలు చూపించిందట.ఇంతకీ ఆ నిర్మాత ఎవరో కాదు అల్లు అరవింద్. ఈయన గురించి టాలీవుడ్ ఇండస్ట్రీలో అందరికీ తెలిసిందే.
ఈయన పారితోషికం విషయంలో చాలా కఠినంగా ఉంటాడు.చాలావరకు అల్లు అరవిందే నటీనటులకు చుక్కలు చూపిస్తాడు.
అటువంటి అల్లు అరవింద్ కే ఈ మిల్క్ బ్యూటీ చుక్కలు చూపించిందట.ఇంతకు అసలేం జరిగిందంటే.
కెరీర్ మొదట్లో తమన్నా టాలీవుడ్ ఇండస్ట్రీలో అంతగా సక్సెస్ కాలేకపోయింది.
ఇక మంచి సక్సెస్ కోసం బాగా ప్రయత్నిస్తున్న సమయంలో బద్రినాథ్ సినిమాలో అవకాశం అందుకుంది.దాంతో అల్లు అరవింద్ సుకుమార్, నాగచైతన్య కాంబినేషన్ లో తమన్నాను తీసుకోవాలని అనుకొన్నాడు.ఇక నిర్మాత రిఫర్ చేసిన పారితోషకం కు ఓకే కూడా చెప్పింది ఈ మిల్క్ బ్యూటీ.
ఇక ఆ తర్వాత ఈ అమ్మడు క్రేజ్ పెరిగి అవకాశాలు రావడంతో సినిమా డేట్స్ విషయంలో తమన్నా అల్లు అరవింద్ నే ముప్పతిప్పలు పెట్టి చుక్కలు చూపించిందట.అలా అందరినే ఇబ్బంది పెట్టే అల్లు అరవింద్ కే తమన్నా ఇటువంటి షాక్ ఇవ్వడంతో అందరూ ఆశ్చర్యపోయారని తెలిసింది.
ప్రస్తుతం ఈ అమ్మడు ఎఫ్ 3, గుర్తుందా శీతాకాలం సినిమాలో బిజీగా ఉంది.వీటితో పాటు బాలీవుడ్ లో కూడా వరుస సినిమాలో నటిస్తుంది.